భారత్ లో ఐటీకి కష్టకాలం ! 64 వేల ఉద్యోగాల్లో కోత పెట్టిన మూడు దిగ్గజాలు..!
భారత్ లో టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న యువతకు ఐటీ సంస్ధలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాల నేపథ్యంలో దేశంలోని మూడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్ధలు తమ ఉద్యోగాల్లో భారీగా కోత పెట్టాయి. దీంతో కరోనా తర్వాత తిరిగి ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుున్న యువతకు ఇదో షాక్ గా మారుతోంది. ఇప్పటికే ఆయా సంస్ధల్లో పనిచేస్తున్న మిగతా వారు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాజాగా ముగిసిన గత ఆర్ధిక సంవత్సరంలో దేశంలో మూడు ప్రముఖ ఐటీ సంస్ధలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ముగ్గురూ కలిపి ఏకంగా 64 వేల ఉద్యోగాల్లో కోత పెట్టేశాయి. దీంతో ఆయా కంపెనీల్లో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారంతా లబోదిబోమంటున్నారు. దీంతోనే ఇది ఆగిపోలేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆయా కంపెనీలు గుడ్ న్యూస్ చెప్తాయని భావించినా అదేమీ లేదని తేలిపోతోంది.

ఇన్పోసిస్ ఆదాయం ఈ ఏడాదిలో 1 నుంచి 3 శాతం తగ్గుతుందని అంచనా వేస్తుండగా.. విప్రో జూన్ కే తమ ఆాదాయంలో 1.5 శాతం క్షీణత ఉంటుందని అంచనా వేసింది. దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది గ్రాడ్యుయేట్లకు నిరాశ తప్పడం లేదు. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయా కంపెనీలు కరోనా సమయంలో భారీగా తీసుకున్న సిబ్బందిలో ఇప్పుడు కోత పెట్టకపోతే లాభదాయకత ఉండదన్నది వీరి అంచనా.
అయితే భారతీయ ఐటీ సంస్ధలతో పోలిస్తే విదేశీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు టెకీలకు కాస్త ఊరటనిచ్చేలా ఉన్నాయి. అవి ఏర్పాటు చేయదల్చుకున్న గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు) అందుబాటులోకి వస్తే ఇక్కడి టెకీలకు కాస్తయినా ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications