టీఎస్పీఎస్సీ ఎఫెక్ట్: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీల్లో మార్పులు
హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగార్థులకు కీలక గమనిక. రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్ఆర్బీ) నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్షల(మెయిన్స్) తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్సై(ఐటీ), ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు పేర్కొంది.
ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు ఉన్నాయని టీఎస్ పీఎస్సీ చేసిన విజ్ఞప్తి మేరకు తేదీల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీకి, కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టీఎస్ఎల్ఆర్బీ వెల్లడించింది.

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగానూ 6,03,955(91.34శాతం) మంది హాజరయ్యారు. ప్రాథమిక ఫలితాలను కూడా విడుదల చేసింది. సివిల్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్ , ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలు జరగ్గా, వాటి ఫలితాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తుది పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, టీఎస్ పీఎస్సీ పరీక్షల కారణంగా తొలుత ప్రకటించిన తుది పరీక్షల తేదీల మార్పు చేశారు.
-
నిరుద్యోగులకు SECL బంపర్ ఆఫర్.. అప్లై చేసేందుకు ఈరోజే లాస్ట్ డేట్ ??? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!











Click it and Unblock the Notifications