ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: అక్కడ మాత్రం అరగంటముందే పేపర్ లాక్కున్నారు!
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా గత అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడంతో.. నేడు అంటే ఆదివారం మళ్లీ ఆ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
వివిధ మార్గాల నుంచి పరీక్ష కేంద్రాలకు తరలివచ్చిన అభ్యర్థుల కోసం టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అభ్యర్థులను గేటు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించి పర్సులు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు ఉంటే బయట పెట్టించి లోనికి అనుమతించారు. షూ వేసుకుని వచ్చినవారిని గేటు వద్దే తీయించి లోనికి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.

ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఉదయం 8.30 గంటల నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 10.15 గంటల తర్వాత వచ్చిన వారిని ఆలస్యమైందంటూ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. దీంతో పలువురు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.
అరగంట ముందే పేపర్ లాక్కున్న ఇన్విజిలేటర్
రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని శ్రీ చైతన్య గ్రూప్-1 పరీక్ష కేంద్రంలో గందరగోళం నెలకొంది. పరీక్ష సమయం ముగిసిందంటూ.. అరగంట ముందే ఇన్విజిలేటర్ అభ్యర్థుల నుంచి పేపర్లు తీసుకున్నాడు. అయితే, బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఇంకా అరగంట సమయం ఉందని తెలిసింది. దీంతో అభ్యర్థులు తమ పేపర్ తిరిగి ఇవ్వాలని ఇన్విజిలేటర్ను కోరారు. అయితే, ఆ పేపర్ తిరిగిచ్చేది లేదని ఇన్విజిలేటర్ తేల్చిచెప్పాడు.
ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ చైతన్య కాలేజీ క్యాంపస్లో దాదాపు 40 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే గ్రూప్-1 పేపర్ లీక్ కావడంతో నిరాశలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అరగంట ముందే పేపర్ లాక్కోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications