యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2024 కు సంబంధించి 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ వంటి దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టుల భర్తీకీ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 24 నుంచి మే 14 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. కేవలం డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 4న రాతపరీక్ష జరగనుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం పది గంటల నుంచి 12 గంటలవరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవాళ్లు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి...
ఖాళీల సంఖ్య: 506 పోస్టులు
బీఎస్ఎఫ్ మొత్తం పోస్టులు : 186
సీఆర్పీఎఫ్ మొత్తం పోస్టులు : 120
సీఐఎస్ఎఫ్ మొత్తం పోస్టులు: 100
ఐటీబీపీ మొత్తం పోస్టులు : 58
సశస్త్ర సీమాబల్ మొత్తం పోస్టులు : 42
వయసు : 01.08.2024 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
దరఖాస్తు రుసుము : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
రెండు పేపర్లు..
మొత్తం 450 మార్కులకు ఈ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1
జనరల్ ఎబిలిటీ & ఇంటెలిజెన్స్కు 250 మార్కులు ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
పేపర్-2
జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్కు 200 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో వ్యాసం రాయాల్సి ఉంటుంది. అయితే ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇతర కమ్యూనికేషన్స్/లాంగ్వేజ్ స్కిల్ మాత్రం ఇంగ్లిష్లోనే రాయాల్సి ఉంటుంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications