Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు...

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్ ఎగ్జామినేషన్‌-2024 కు సంబంధించి 506 అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ వంటి ద‌ళాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది.

అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఈ పోస్టుల భ‌ర్తీకీ ఆన్‌లైన్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది. ఏప్రిల్ 24 నుంచి మే 14 వ‌ర‌కు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. కేవ‌లం డిగ్రీ అర్హ‌త‌తో ఈ ఉద్యోగాల‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.

UPSC Notification Released 506 Assistant Commandant Posts

ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఆగస్టు 4న రాతపరీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ ప‌రీక్ష రెండు సెష‌న్ల‌లో నిర్వ‌హిస్తారు. మొద‌టి సెష‌న్ ఉద‌యం ప‌ది గంటల నుంచి 12 గంట‌ల‌వ‌ర‌కు ఉంటుంది. రెండో సెష‌న్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

ఈ ఉద్యోగాల‌కు రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునేవాళ్లు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి...

ఖాళీల సంఖ్య: 506 పోస్టులు

బీఎస్‌ఎఫ్ మొత్తం పోస్టులు : 186
సీఆర్‌పీఎఫ్ మొత్తం పోస్టులు : 120
సీఐఎస్‌ఎఫ్ మొత్తం పోస్టులు: 100
ఐటీబీపీ మొత్తం పోస్టులు : 58
సశస్త్ర సీమాబల్ మొత్తం పోస్టులు : 42

వయసు : 01.08.2024 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య వ‌య‌సు ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దరఖాస్తు రుసుము : ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

రెండు పేప‌ర్లు..

మొత్తం 450 మార్కులకు ఈ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్-1
జనరల్ ఎబిలిటీ & ఇంటెలిజెన్స్‌‌కు 250 మార్కులు ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-2

జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌కు 200 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో వ్యాసం రాయాల్సి ఉంటుంది. అయితే ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇతర కమ్యూనికేషన్స్/లాంగ్వేజ్ స్కిల్ మాత్రం ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+