రైలు నుంచి దూకిన హీరోయిన్.. తీవ్రగాయాలతో హాస్పిటల్ బెడ్ పై ఫోటో !
బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. కదులుతున్న రైలు నుంచి దూకడంతో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్గా మారింది.
ఘటన ఎలా జరిగింది?
కరిష్మా శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ సంఘటన గురించి వివరించారు. ''నిన్న ఓ సినిమా షూటింగ్ స్పాట్కు వెళ్లడానికి చీర కట్టుకుని బయల్దేరాను. ముంబై లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది. నా స్నేహితులు రైలు అందుకోలేకపోయారు. వాళ్లు ఎక్కలేకపోయారన్న భయం, టెన్షన్తోనే నేను కదులుతున్న రైలు నుంచి దూకేశాను. దురదృష్టవశాత్తూ వెనక్కి పడటంతో నా వీపు, తలకు గాయాలు అయ్యాయి'' అని ఆమె రాసుకొచ్చారు.

అయితే డాక్టర్లు ఆమెకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని.. తలకు గాయం కారణంగా ఎంఆర్ఐ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. కరిష్మా తన అభిమానులను ధైర్యం చెబుతూ.. నేను బాగానే ఉన్నాను, త్వరగా కోలుకుంటాను. మీ ప్రేమ, అభిమానం నాకు చాలా అవసరం అని పేర్కొన్నారు.
కరిష్మా శర్మ సినీ ప్రయాణం
కరిష్మా శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో రాణిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె 2015లో వచ్చిన 'ప్యార్ కా పంచనామా 2' సినిమాలో తన గ్లామర్తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'రాగిని ఎంఎంఎస్: రిటర్న్స్' వెబ్ సిరీస్లో బోల్డ్ రోల్ చేసి మరింత పేరు తెచ్చుకున్నారు.

అలాగే 'ఉజ్డా చమన', 'హోటల్ మిలన్', 'సూపర్ 30' వంటి చిత్రాల్లో కూడా నటించి తన ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు. అంతేకాకుండా అనేక హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్లోనూ కరిష్మా తన గ్లామర్తో మెరిసారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది.












Click it and Unblock the Notifications