'పెద్ది' వివాదంపై అనసూయ పోస్టు వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే పెద్ది సినిమాలో కొన్ని సీన్స్ పై వివాదం చెలరేగింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం.. కొన్ని రొమాంటిక్ సీన్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా ఇదే విషయంపై దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు తెలియజేసిన విషయం తెలిసిందే. వివాదంగా మారిన పలు సీన్లలో మార్పలు చేయనున్నట్లు ప్రకటించారు.

Anasuya Posts on Peddi movie Controversy Goes Massively Viral on Social Media Huge Buzz Created

మరోవైపు 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్న వేళ అనసూయ చేసిన పోస్టు ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా కల్పిత కథ. మంచి, చెడు నిర్ణయించుకునే విచక్షణ ప్రేక్షకుడిపైనే ఉంటుంది. చిత్రాలు చూసి పిల్లలు చెడిపోవడం అన్నది సరికాదు. దర్శక రచయితలకు తాము అనుకున్న కథను చెప్పే స్వేచ్ఛ ఉండాలి. అలాగే సమాజం పట్ల బాధ్యతా ముఖ్యమే. ఇకనైనా క్రియేటర్లు బాధ్యతాయుతంగా కంటెంట్ తీసుకొస్తారని ఆశిస్తున్నా.. అని పేర్కొన్నారు.

ఇక పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే ఈ చిత్రానికి రూ. 135 కోట్లకు పైగా వసూల్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక పెద్ది చిత్రం 1980 ల నాటి గ్రామీణ విజయనగరం నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది. ఈ మూవీలో జగపతిబాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+