తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. డెలివరీ ఎప్పుడో చెప్పిన స్టార్ కపుల్!!
బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు తమ అభిమానులకు శుభవార్త చెప్పారు. ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని వెల్లడించారు. 38 ఏళ్ల వయసులో దీపికా పదుకొనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఈ కపుల్ instagram వేదికగా వెల్లడించారు.
ఆరేళ్ల పాటు డేటింగ్ చేసి 2018 లో పెళ్లి చేసుకున్న దీపికా పదుకునే రణవీర్ సింగ్ జంట తాము తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని వెల్లడించారు. ఇక ఇదే క్రమంలో సెప్టెంబర్లో డెలివరీ కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలు దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, శ్రేయ ఘోషల్, ప్రీతి జింటా, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్, కృతి సనన్ తదితరులు ఈ జంటకు కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇటీవల లండన్లోని 77వ లండన్లోని 77వ BAFTA వేడుకలో దీపిక పదుకొనే తన బేబీ బంప్ కనిపించకుండా, ఆమె తన కడుపుని దాచుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ పై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ జంట instagram ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తమ పోస్టులో అప్పుడే పుట్టిన పసిబిడ్డకు ఉపయోగించే బట్టలు తదితర యాక్సెసరీస్ ను పెట్టి అందులో సెప్టెంబర్ అంటూ డెలివరీ మంత్ ను దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ జంట ప్రకటించారు .
రామ్ లీలా సినిమాలో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టడం తో పాటు, ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అప్పుడే వీరు ఇరువురు ప్రేమలో పడ్డారు. అనంతరం బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలలో ఇద్దరు కలిసి నటించారు.
2013లో మొదలైన వీరి ప్రేమ కథ 2018లో పెళ్లిగా మారింది. నవంబర్ 14న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లయిన ఆరేళ్ల తర్వాత దీపికా పదుకొనే తల్లి కాబోతున్న విషయాన్ని ఈ జంట అందరికీ షేర్ చేసింది. అభిమానులకు త్వరలోనే జూనియర్ వస్తున్నట్టు ప్రకటించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications