ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్?
ఇటీవలి కాలంలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ గురించి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన వార్తలు వచ్చాయి. ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని, ఒక సోషల్ మీడియా ఖాతాను మరొకరు అన్ ఫాలో చేశారంటూ వార్తలు రావడంతో నిజమే అనుకున్నారు అందరూ. తర్వాత ఇద్దరూ ప్రకటన చేశారు.. అటువంటిదేమీ లేదని, అవన్నీ ఫేక్ వార్తలని. మిస్ వరల్డ్ కిరీటం గెలిచి 30 సంవత్సరాలవుతున్నప్పటికీ ఇప్పటికీ అదే అందంతో అలరారుతున్న ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఐశ్వర్య లుక్ పై తీవ్ర చర్చలు
పారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఆ కార్యక్రమానికి ఐశ్వర్యారాయ్ హాజరైంది. అయితే ఆమె లుక్ పై ఇప్పుడు తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఏదో గుర్తు తెలియని వ్యాధితో ఆమె బాధపడుతోందంటున్నారు. ధూమ్ 2 సినిమాలో సన్నగా, మెరుపుతీగలా కనపడిన ఐశ్వర్యారాయ్ ఇప్పుడు బొద్దుగా, కాస్త లావుగా కనపడింది. సాధారణంగా మనిషికి వయసు పెరుగుతున్నకొద్దీ మార్పులు వస్తుంటాయి. ఇది సహజంగా జరిగేదే. 1973 నవంబరు ఒకటోతేదీన జన్మించిన ఐశ్వర్యారయ్ కి ఇప్పుడు 50 సంవత్సరాలు.

వయసుకు తగినట్లుగానే కనపడతారు
ఈ వయసులో వయసుకు తగినట్లుగానే కనపడతారు. ఏ మనిషికైనా 16 సంవత్సరాల వయసులో ఉన్నట్లుగా కనపడాలంటే అసాధ్యం. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. దీనిపై ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో తన స్నేహితురాలు ఒకరు పనిచేస్తున్నారని, ఐశ్వర్యారాయ్ ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని చెప్పింది.
దానివల్ల ఆమె సరిగా తినలేకపోతోందని, బరువు పెరిగిపోతోందని చెప్పిందంటూ ఆ పోస్ట్ లో నెటిజన్ పేర్కొన్నాడు. ఎన్ని మందులు వాడినప్పటికీ ప్రయోజనం కనపడటంలేదని, సన్నగా కనిపించడానికి ఐశ్వర్య చాలా కష్టపడుతోందంటున్నారు. కూతురును ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్న ఐశ్వర్యారాయ్ తన కుమార్తె హైలైట్ అవడం కోసం కాస్తంత తగ్గే అవకాశం ఉంటుందని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications