Karthika deepam 2 December 19th:రక్తపు వాంతి చేసుకున్న సుమిత్ర..శ్రీధర్ అరెస్ట్..!!
బుల్లితెరపై తిరుగులేని ఆదరణ పొందుతున్న 'కార్తీకదీపం 2' సీరియల్ ఇప్పుడు ఊహించని మలుపులతో ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి ఎపిసోడ్లో శౌర్య తన మాటలతో నానమ్మ కాంచన మనసును కరిగించడం, మరోవైపు జ్యోత్స్న-వైరాలు కలిసి శ్రీధర్ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేయడం చూశాం. మరి నేడు డిసెంబర్ 19వ తేదీ, 545వ ఎపిసోడ్లో జరిగిన సంచలన పరిణామాలు ఇప్పుడు మీకోసం...
కాశీకి వైరా గాలం.. జీఎం పోస్ట్, 10 లక్షల బోనస్!
నేటి ఎపిసోడ్ ప్రారంభంలో జ్యోత్స్న ప్లాన్ ప్రకారం కాశీని తన దగ్గరకు పిలిపించుకుంటాడు వైరా. కాశీ పీఏగా పనిచేస్తున్నాడని తెలిసి, అతని పౌరుషాన్ని రెచ్చగొడతాడు. "నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు చేసే పనేంటి? నిన్ను కాలి కింద చెప్పులా చూస్తున్న వారి దగ్గర ఇంకెన్నాళ్లు ఉంటావు?" అంటూ నిలదీస్తాడు. కాశీకి ఏకంగా తన కంపెనీలో జనరల్ మేనేజర్ (GM) పోస్ట్ ఆఫర్ చేస్తాడు. అంతేకాకుండా, జాయినింగ్ బోనస్ కింద 10 లక్షల రూపాయలు, కారు, సొంతిల్లు ఇస్తానని ఆశ చూపుతాడు. ఈ క్రమంలో జ్యోత్స్న కూడా కాల్ చేసి, ఇది తన పవర్ అని, ఇకపై ఎవరి దగ్గరో బానిసలా ఉండాల్సిన అవసరం లేదని కాశీకి నూరిపోస్తుంది. ఆ మాటలతో కాశీ మనసు మారిపోయి, తన బాస్లకు బుద్ధి చెబుతానని వైరాకు మాటిస్తాడు.

శ్రీధర్ అరెస్ట్.. ఫుడ్ ట్రక్స్ వెనుక భారీ కుట్ర!
మరోవైపు, శ్రీధర్ ఫుడ్ ట్రక్ బిజినెస్ సక్సెస్తో మీడియా అంతా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది. అందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ శ్రీధర్ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో.. కాశీ పోలీసులతో కలిసి అక్కడికి వస్తాడు. ఫుడ్ ట్రక్ దగ్గర ఆహారం తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారని, అది కల్తీ ఆహారమని పోలీసులు శ్రీధర్ను నిలదీస్తారు. శ్రీధర్ ఎంత సర్దిచెప్పినా వినకుండా, సీఈవోగా బాధ్యత వహించాలంటూ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదంతా చూసిన మీడియా శ్రీధర్ను చుట్టుముట్టడంతో పరిస్థితి చేయి దాటిపోతుంది. కాశీ చేసిన ఈ వెన్నుపోటు శ్రీధర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది.
దీపపై సుమిత్ర మాతృప్రేమ.. అత్తమ్మకు ఏమైంది?
ఇంట్లో దీప పని చేస్తుంటే, సుమిత్ర వచ్చి ఆమెను ఆపుతుంది. కడుపుతో ఉన్నప్పుడు వంగి పని చేయకూడదని, పురిటి గురించి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది. "నీకు తల్లి లేదు, పుట్టిల్లు లేదు.. అందుకే ఈ తల్లి చెప్పాల్సిన జాగ్రత్తలు నేను చెబుతున్నాను" అంటూ సుమిత్ర చూపించిన ప్రేమకు దీప కంటతడి పెడుతుంది. సుమిత్రను తన తల్లిగా భావించి దీప ఎంతో ఆనందిస్తుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.
రక్తపు వాంతి చేసుకున్న సుమిత్ర.. అసలు నిజం ఏంటి?
ఇల్లు ఊడుస్తున్న సుమిత్ర ఒక్కసారిగా దగ్గుతూ వాష్ రూంలోకి వెళ్తుంది. అక్కడ ఆమె నోటి వెంట రక్తం రావడంతో దీప, దశరథలు షాక్ అవుతారు. సుమిత్రకు ఏమైందని దీప కంగారుగా అడిగితే.. దశరథ ఆ విషయాన్ని దాటవేస్తూ, ఇవన్నీ మర్చిపొమ్మని దీపకు చెబుతాడు. అసలు సుమిత్ర అనారోగ్యం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దశరథ ఆ నిజాన్ని ఎందుకు దాస్తున్నాడు? అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది.
కాశీ వేసిన స్కెచ్తో శ్రీధర్ జైలుపాలయ్యాడు. అటు సుమిత్ర ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరి కార్తీక్ తన తండ్రిని ఎలా కాపాడతాడు? సుమిత్రకు వచ్చిన జబ్బు ఏంటి? జ్యోత్స్న కుతంత్రాలు ఎప్పటికి బయటపడతాయి? అనే ఆసక్తికర విషయాలు రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే!
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications