Karthika deepam 2 September 26 Episode:దీప కళ్లల్లో నీళ్లు ...షాక్లో జ్యోత్స్న!
గత ఎపిసోడ్లో,కార్తీక్, దీపల సంభాషణను జ్యోత్స్న, పారులు విన్నారు. మరోవైపు, కాశీకి జాబ్ ఇప్పిస్తానని వచ్చిన జ్యోత్స్నను శ్రీధర్ తిరస్కరించాడు. అయితే, రాత్రి నుంచి ఆహారం తీసుకోని దీప కళ్లు తిరిగి కిందపడిపోగా, సుమిత్ర ఆందోళన చెందుతుంది. కార్తీక్కు ఫోన్ చేసి విషయం చెప్పి, దీపకు భోజనం పెట్టి "నీకు తినిపించే ప్రేమ లేదు, కానీ మానవత్వం ఉంది" అని అంటుంది. ఈ కీలక పరిణామాల తర్వాత, సెప్టెంబర్ 30న ప్రసారమైన 476వ ఎపిసోడ్ ఉద్వేగభరితంగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 30)లో..
దీప కళ్లు తెరిచిన వెంటనే సుమిత్ర ఆమెను మందలిస్తుంది. "నువ్వు పడిపోతే నాకు ఇష్టం లేకపోయినా కంగారు పడ్డాను, ఎందుకంటే ఇంట్లో వేరే ఎవరూ లేరు. నా బుద్ధి సరిగా పనిచేయని రోజుల్లో నిన్ను కూతురిలా చూసుకున్నాను," అని పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. అయితే, "నువ్వు అబద్ధాలాడుతున్నావు, నీ స్వార్థం పెరిగింది" అని నిందిస్తూనే, "తిండి మానేసినంత మాత్రాన కోపం పోదు. నా భర్తను కావాలనే షూట్ చేశావని ఒప్పుకుంటేనే క్షమిస్తా" అని కఠినంగా చెబుతుంది.

ఈ మాటలకు దీప కంటతడి పెట్టుకోగా, ఎక్కిళ్లు రావడంతో సుమిత్ర వెంటనే పరుగున వెళ్లి నీళ్లు తెచ్చి తాగిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన కార్తీక్, జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. "మీరు అంత కోపం చూపిస్తే కానీ నా భార్య తినదు కదా అత్తా?" అని కార్తీక్ సెటైర్ వేస్తాడు. సుమిత్ర మంచితనం ఎక్కడికీ పోలేదని కార్తీక్ అంటాడు. దీప- సుమిత్రలు దగ్గరవుతున్నారని భయపడిన జ్యోత్స్న, పారుతో గొడవ పడుతుంది. ఈ క్రమంలో పిల్లలను మార్చిన విషయం గురించి గట్టిగా మాట్లాడి పారును బ్లాక్మెయిల్ చేస్తుంది.
మరోవైపు, కాంచన దగ్గరికి వచ్చిన శ్రీధర్, ఆమెకు సరుకులు, డబ్బులు ఇస్తాడు. "నీ కొడుకు జీతం లేని పనివాడిలా వెట్టిచాకిరీ చేస్తున్నాడు. నీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఇది తీసుకో. నీ అవసరం తీరాక తిరిగి ఇవ్వు, కానీ ఈ విషయం కార్తీక్కి చెప్పొద్దు" అని వేడుకుంటాడు. కార్తీక్ వచ్చే సమయానికి కాంచన ఆ డబ్బును దాచేస్తుంది. కార్తీక్ ఆ సరుకుల గురించి అడగ్గా, అనసూయ అవి శ్రీధర్ తెచ్చినట్లు చెబుతుంది. దీనితో కార్తీక్ అనుమానంగా ఉంటాడు. ఈ పరిణామాలతో తర్వాతి ఎపిసోడ్ ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications