తల్లి కాబోతోన్న రామ్ చరణ్ హీరోయిన్.. చిట్టి సాక్సులు షేర్ చేసిన బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్ గా మారింది. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ భామ. తాజాగా 'గేమ్ ఛేంజర్'తో మరోసారి టాలీవుడ్ లో సందడి చేసింది. అయితే 2023లో ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కియారా అడ్వాణీ గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతోన్నానని చెప్పేసింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీలు తమకు పండండి బిడ్డ పుట్టబోతోందని తెలిపారు. ఈమేరకు చిట్టి సాక్సులను షేర్ చేశారు. ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కమింగ్ సూన్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టుపై సమంత మొదటగా స్పందించారు. ఓ మై గాడ్.. కంగ్రాంట్స్ అంటూ కామెంట్ చేశారు. ఆమెతో పాటు.. ఈ పోస్టుపై నెటిజన్లు, సెలెబ్రిటీలు వీరికి కంగ్రాట్స్ చెబుతున్నారు. వీరిలో రకుల్, రియా కపూర్, ఇషాన్ కట్టార్, హ్యూమా ఖురేషి ఉన్నారు.
కియారా అద్వానీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్లో కూడా ఎక్కువగా పాల్గొనలేదు. కారణం ఇదే అయి ఉంటుందని ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు.ఇక కియారా, సిద్దార్థ్లకు రెండేళ్ల క్రితం పెళ్లి అయిన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి 7న వీరికి రాజస్థాన్లోని కోట ఘనంగా వివాహాం జరిగింది.












Click it and Unblock the Notifications