Mogali Rekulu: మొగలిరేకులు దయ ఇక లేరు.. చిన్న వయస్సులోనే కన్నుమూసిన పవిత్రనాథ్..!
పవిత్రనాథ్ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అనారోగ్యంతోనే అతను మరణించినట్లు సమాచారం. తెలుగు బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సీరియల్ జెమిని టీవీలో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యేది. సీరియల్ లో నటించిన నటులు చాలా ఫేమస్ అయ్యారు. ఈ సీరియల్ లో నటించిన పవిత్రనాథ్ మరణించారు.
ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవిత్రనాథ్ మరణంతో బులితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. పవిత్రనాథ్ మొగలిరేకులు సీరియల్ లో దయ పాత్రలో మెప్పించారు. అతడు చనిపోయాడని తెలుసుకన్న అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సలో అతను చనిపోవడం బాధకరమైని చెబుతున్నారు. పవిత్రనాథ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

పవిత్రనాథ్ ఎలా చనిపోయాడు అనే విషయం తెలియరాలేదు. మేఘన్ పవిత్రనాథ్ ఇక లేరు అనే మాత్రమే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పవిత్రనాథ్ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అనారోగ్యంతోనే అతను మరణించినట్లు సమాచారం.
పవిత్రనాథ్ అంతపురం, కృష్ణ తులసి సీరియళ్లలో కూడా నటించారు. ఆయన గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పవిత్రనాథ్ తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని అతడి భార్య ఆరోపించారు. తన ముందే ఇతర అమ్మాయిలతో తిరుగుతున్నాడని చెప్పింది. అప్పట్లో ఈ విషయం సంచనలనంగా మారింది.












Click it and Unblock the Notifications