పదిరోజులు ముంబైలో మకాం వేయనున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?
జూనియర్ ఎన్టిఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా, ఎన్టిఆర్కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఓ పది రోజులపాటు ముంబైలో మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పడు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ ముంబై వెళ్లనున్నట్లు సమాచారం.
ఈ శుక్రవారం నుంచే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పాల్గొంటారని బీ టౌన్ వర్గాల్లో గుసుగుసలు వినిపిస్తోన్నాయి. అందుకోసమే ముంబైలో పదిరోజులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగబోతున్నట్లు సమాచారం. ఈ షూటింగ్లో హృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్లో భాగంగానే ఎన్టీఆర్ ముంబై బయలుదేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో జూనీయర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. బాలీవుడ్ మొదటి సినిమాలోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలసి పనిచేస్తున్నారు.

ఎన్టీఆర్ రోల్తో సింగిల్గా మరో సినిమా..
వార్ 2 సినిమా గురించి తాజాగా వచ్చిన ఈ అప్డేట్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ RAW ఏజెంట్గా కనింపించబోతున్నారని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో యే జవానీ హై దివానీ, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. వార్ 2 సినిమా అనంతరం ఎన్టీఆర్ రోల్తో సింగిల్గా మరో సినిమా కూడా ఉండబోతుందని బీ టౌన్ మీడియాలో వినిపిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని 2025 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications