మోస్ట్ వైలెంట్ దర్శకుడితో ప్రభాస్ సినిమా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. కానీ ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగానే వచ్చినప్పటికీ ప్లాఫ్ టాక్ కారణంగా వసూల్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మూవీ తర్వాత ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 చిత్రాలు కూడా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ఇటీవల మార్కో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన ఉన్ని ముకుందన్ ఇందులో ఫుల్ టైమ్ హీరోగా కనిపించారు. ఈ మూవీలోని వయొలెన్స్ సీన్స్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అందుకే అప్పట్లో ఈ మూవీని యూత్ ఎగబడి చూశారు. ఎక్కువగా సున్నితమైన సినిమాలు తీసే మాలీవుడ్ లో ఇలాంటి సినిమా రావడం.. అది కూడా అంత పెద్ద విజయం దక్కడం ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన హనీఫ్ వినిపించిన ఒక పవర్ఫుల్ లైన్ ప్రభాస్ కూ విపరీతంగా నచ్చిందట. ఆయన ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ 2028 లో ప్రారంభమై 2029 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ క్రేజీ కాంబో విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications