అవును వారిద్దరు ఒకటయ్యారు...సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ
ఇన్నాళ్ల ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్గా పేరుపొందిన రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. తమ బంధం గురించి ఇన్నాళ్లు మౌనం వహించిన ఈ లవ్ బర్డ్స్, ఈరోజు నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ ఎంగేజ్మెంట్ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే, అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

రష్మిక, విజయ్ల పెళ్లి వేడుక గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్లో వీరి పెళ్లిని అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. రష్మిక మందాన-విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' 'సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి సినిమాల్లో కనిపించలేదు కానీ..తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు. ముంబై ఎయిర్పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. తాజాగా నిశ్చితార్థంతో ఈ జంట ఒకటి కాబోతున్నారు.












Click it and Unblock the Notifications