"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ"
ప్రస్తుతం సినీ లోకంలో పొలిటికల్ డ్రామాలు, యధార్థ గాథల పేరుతో వస్తున్న చిత్రాలపై చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ నటి అనీత్ పడ్డా సోదరి రీత్ పడ్డా చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. తాజాగా విడుదలైన 'ధురంధర్' సినిమాపై రీత్ పడ్డా సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను ఆమె ఓ 'ప్రభుత్వ అనుకూల ప్రాజెక్ట్'గా అభివర్ణించారు.
ప్రభుత్వ మెప్పుకోసమే ఈ సినిమా!
రీత్ పడ్డా తన తాజా పోస్టులో ధురంధర్ సినిమా కథాంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఈ చిత్రం కేవలం ఓ నిర్దిష్ట ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిది. ఇది కథను చెప్పడం కంటే.. అధికారంలో ఉన్నవారి వద్ద మార్కులు కొట్టేయడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తోంది" అని రీత్ పడ్డా పేర్కొన్నారు. ఇది వినోదాత్మక చిత్రంలా కాకుండా ఓ రాజకీయ పార్టీకి రాసిన ప్రతిపాదన లేఖలా ఉందని ఎద్దేవా చేశారు.

కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలపై విమర్శలు
రీత్ పడ్డా విమర్శలు కేవలం ధురంధర్కే పరిమితం కాలేదు. గతంలో సంచలనం సృష్టించిన కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాలను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం. ఇలాంటి చిత్రాలు పరిమిత సత్యాలను అతిగా చూపిస్తూ.. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రధానం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి "సెలెక్టివ్ స్టోరీ టెల్లింగ్" ప్రజల ఆలోచనా విధానాన్ని తప్పుదోవ పట్టిస్తుందని రీత్ పడ్డా అభిప్రాయపడ్డారు.
'పంజాబ్ 95' లాంటి సినిమాల పరిస్థితి ఏంటి?
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సినిమాలకు బలమైన రాజకీయ మద్దతు, ప్రచారం లభిస్తాయని.. కానీ 'పంజాబ్ 95' వంటి వాస్తవాలను ప్రతిబింబించే సినిమాలు విడుదల, పంపిణీలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని రీత్ పడ్డా గుర్తుచేశారు. పొలిటికల్ నెరేటివ్స్కు అనుగుణంగా లేని సినిమాలను తొక్కేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Sister of Actress Aneet Padda calling Dhurandhar, Kashmir Files & Kerala Story as propaganda. pic.twitter.com/Qm2LLUFIaH
— Squint Neon (@SquintNeon) March 27, 2026
ప్రియాంక చోప్రాకు సూటి ప్రశ్న
ఈ వివాదంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరును కూడా రీత్ పడ్డా లాగారు. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమాల గురించి మాట్లాడే సెలబ్రిటీలు, దేశంలో జరుగుతున్న ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు. సెలబ్రిటీలు తమ పలుకుబడిని సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగించాలని.. కానీ చాలా మంది తమ స్వార్థం కోసం మౌనంగా ఉంటున్నారని రీత్ పడ్డా విమర్శించారు.
ప్రియాంక చోప్రాపై పరోక్ష విమర్శలు
ఈ వివాదంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరును కూడా రీత్ లాగారు. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమాల గురించి మాట్లాడే సెలబ్రిటీలు, దేశంలో జరుగుతున్న ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు. సెలబ్రిటీలు తమ పలుకుబడిని సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగించాలని, కానీ చాలా మంది తమ స్వార్థం కోసం మౌనంగా ఉంటున్నారని ఆమె విమర్శించారు.
-
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
సాయి పల్లవి ఫ్యాన్స్కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications