Fact check : భారత్ ఆర్మీపై చైనా మైక్రోవేవ్ వెపన్స్తో దాడి చేసిందా..?
భారత్-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దౌత్యపరంగా,మిలటరీ పరంగా చర్చలు జరుగుతూనే ఉన్నా.. సరిహద్దు వివాదం ఓ కొలిక్కి రావట్లేదు. ఈ నేపథ్యంలో జిన్ కాన్రాంగ్ అనే ఓ చైనా ప్రొఫెసర్ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. భారత్ ఆక్రమించిన వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయించేందుకు చైనా మెక్రోవేవ్ వెపన్స్తో దాడులకు దిగిందన్నారు.
Recommended Video
అంతేకాదు,చైనా మైక్రోవేవ్ దాడులకు భారత దళాలు వాంతులు చేసుకున్నాయని.. బలవంతంగా అక్కడినుంచి వెనక్కి వెళ్లేందుకు సిద్దపడ్డాయని అన్నారు. దీంతో ఎటువంటి కాల్పులకు చోటు లేకుండానే చైనా ఆ వ్యూహాత్మక శిఖరాలను తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం చిక్కిందన్నారు.

మరోవైపు చైనా ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలను భారత ఆర్మీ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని చెప్పింది. భారత ఆర్మీని మానసికంగా దెబ్బకొట్టేందుకే చైనా ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించింది. పాంగాంగ్ త్సో సరస్సుకు దక్షిణ తీరాన ఉన్న కైలాష్ రేంజ్ శిఖరాలను భారత్ ఆక్రమించిన షాక్ నుంచి పీఎల్ఏ ఇంకా తేరుకోవట్లేదని పేర్కొంది.
కాగా,మైక్రోవేవ్ వెపన్స్ మానవ కణజాలాన్ని టార్గెట్ చేస్తాయి. దాని నుంచి ప్రసరించే విద్యుత్ అయస్కాంత తరంగాలు మానవ శరీరం భరించలేనంత నొప్పిని పుట్టిస్తాయి. పర్వత శ్రేణుల్లో శత్రు దేశ బలగాలను వెనక్కి తరిమేందుకు ఇలాంటి ఆయుధాలు వాడుతుంటారు.
భారత్-చైనా మధ్య గత కొన్ని నెలలుగా సరిహద్దు వివాదం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జూన్లో సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆ దేశం అధికారికంగా దానిపై ఏమీ మాట్లాడలేదు. అప్పటినుంచి ఇప్పటివరకూ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Fact Check
వాదన
భారత ఆర్మీ లక్ష్యంగా మైక్రోవేవ్ వెపన్స్తో చైనా దాడికి పాల్పడింది.
వాస్తవం
ఇది పూర్తిగా అవాస్తవమని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.
రేటింగ్
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications