అదొక
అద్భుత
కళాజగత్తు...
అందులోని
ప్రతీ
దృశ్యం
కళాకారుల
భావావేశానికి,
సృజనాత్మక
శక్తికి
నిదర్శనం...హైదరాబాద్లోని
పంజాగుట్టలో
గల
సూర్య
ఆర్ట్
గ్యాలరీలో
ఏర్పాటుచేసిన
గ్రాఫిక్స్
18
ప్రదర్శన
కళాభిమానుల్ని
ఎంతగానో
ఆకట్టుకుంటోంది.
మదిలో
మెదిలే
భావపరంపరకు
చిత్రికపెట్టి
వర్ణార్ణవంగా
మలచిన
18మంది
ప్రఖ్యాత
కళాకారుల
చిత్రాలతో
ప్రదర్శన
సందర్భంగా
ఇక్కడ
కొలువుతీరాయి.
దేశంలోని
పలు
ప్రాంతాలకు
చెందిన
కళాకారులు
అక్బర్
పదంసీ,
డి.ఎల్.ఎన్.రెడ్డి,
డి.దేవరాజ్,
గోపాల్
సాన్యల్,
జోగెన్
చౌదరి,
కె.కె.హెబ్బార్,
కె.ఎం.ఆదిమూలం,
కె.జి.సుబ్రహ్మణ్యం,
క్రిషన్
ఖన్నా,
లాలూప్రసాద్షా,
పరితోష్సేన్,
ఆర్.బి.భాస్కరన్,
ఆర్.ఎం.పలనియప్పన్,
శక్తిబర్మన్,
సనత్కర్,
శుక్లాసేన్
పాద్దార్,
సుభాష్రాయ్,
తపన్ఘోష్ల
చిత్రాలు
వారి
సృజనాత్మకశక్తికి,
మేధస్సుకు
అద్దం
పడుతున్నాయి.