వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివియస్‌ లక్ష్మణ్‌ చేసిన పాపమేమి?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారత్‌ విజంయం సాధించాలంటే బీహార్‌ సంపన్నం కావాలని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ అన్నారు. రాష్ట్రపతి కలను సాకారం చేసేందుకే అన్నట్లు తమ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ హైదరాబాద్‌లో జరిగే ప్రవాస భారతీయ దివస్‌కు తరలివస్తున్నారు. ఇరవై మంది సభ్యుల బృందంతో ఆయన హైదరాబాద్‌లో కాలు పెడుతున్నారు. తూర్పు ప్రాంతంలో బీహార్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ స్టేట్‌ అని, పెట్టుబడులకు బీహార్‌లో ఇతోధిక అవకాశాలున్నాయని ఆయన ప్రవాస భారతీయులకు నచ్చజెప్పే యోచనతో ఉన్నారు.

ప్రవాస భారతీయ దివస్‌ను ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభిస్తారు. ఈ సమావేశానికి 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇందులో నితీష్‌ కుమార్‌ ఒకరు. ఈ సమావేశం మూడు రోజుల పాటు జరుగుతుంది. రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ ముగింపు సమావేశంలో 15 మంది ఎన్నారైలకు ప్రవాసి భారతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ సమావేశానికి 2,500 మంది ఎన్నారై ప్రతినిధులు హాజరవుతారని ఒక అంచనా.

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఇప్పటికే పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయ దివస్‌ సందర్భంగా వచ్చే ప్రతిపాదనలను పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రాథమిక ఆమోదం తెలియజేయడానికి దానికి అధికారం ఇచ్చారు. ఈ పెట్టుబడులు రావడానికి నితీష్‌కుమార్‌ ప్రవాస భారతీయ దివస్‌లో పలు రాయితీలు ప్రకటిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X