వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఖీ సావంత్ మరో గొడవ

By Staff
|
Google Oneindia TeluguNews

Rakhi Sawant
తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న రాఖీ సావంత్ మరోసారి వివాదానికి తెరలేపింది. రియాల్టీ షోను నిర్వహించిన స్టార్ ప్లస్ పై ఆమె క్రిమినల్ కేసు వేసింది. ఈ కార్యక్రమం నుంచి తనను కావాలనే తప్పించారని ఆమె గుర్రుమంటోంది. తనను స్టార్ ప్లస్ వారు మోసం చేశారని, తనకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. నాస్ బలియే షో నుంచి తనకు ప్రథమ బహుమతి దక్కకుండా చేశారని ఆమె అంటోంది. ఫైనల్ కు చేరుకున్న ఇద్దరు స్టార్ ప్లస్ సీరియళ్లలో నటిస్తున్నారని, అందుకే తనను తప్పించారని ఆమె అంటోంది. దమ్ముంటే ఈ నెల 31వ తేదీన వారిద్దరు తనతో పోటీకి రావాలని ఆమె సవాల్ చేస్తోంది.

అయితే ఈ కేసు విషయంలో పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదట. ఎస్ యమ్ ఎస్ ల విషయంలో కూడా తనకు అన్యాయం జరిగిందని రాఖీ సావంత్ అంటోంది. రియాల్టీ షోలో ఎస్ యం ఎస్ లు రాకుండా చానెల్ బ్లాక్ చేసిందని రాఖీతో పాటు అభిషేక్ అవస్తి ఆరోపించారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ షోలో డజను జంటలు పాల్గొన్నాయి. ప్రథమ బహుమతి పొందిన నటి సంజీదా షేక్, ఆమె కొరియోగ్రాఫర్ అమీర్ అలీ స్టార్ ప్లస్ కు చెందిన పలు సీరియళ్లలో నటిస్తున్నారని వారంటున్నారు. తనను బలవంతందా ముద్దు పెట్టుకున్నాడని ఆరోపిస్తూ గాయకుడు మికాపై గతంలో రాఖీ సావంత్ ఫిర్యాదు చేసింది. అయితే రాఖీదంతా పబ్లిసిటీ స్టంటేనని స్టార్ ప్లస్ వర్గాలు అంటున్నాయి. రాఖీ సావంత్ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X