తెలంగాణ ప్రజాపోరాటం -పాఠాలు: సుందరయ్య పుస్తకం

Telangana
పుచ్చలపల్లి సుందరయ్య పేరు వినని వారుండరు. జ్యోతిబసు తరానికీ చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఆయన. ప్రజా ఉద్యమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తీరిక చేసుకుని ప్రజల మేధోవికాసం కోసం, శ్రేయస్సు కోసం రాసిన గొప్ప పుస్తకమిది. సుందరయ్య నిజాంకు వ్యతిరేకంగా 1940వ దశకంలో సాగిన తెలంగాణ రైతుల సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. వెట్టి చాకిరీ నుంచి అనేక మంది శ్రామికులకు విముక్తి కల్పించారు.

ఆనాటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక, ఆర్ధిక పరిస్ధితులను సుందరయ్య ఈ పుస్తకంలో కళ్ళకు కట్టారు. నిజాంకు వ్యతిరేక పోరాటంలో గెరిల్లా దళాల బలం, బలహీనతలను వివరించారు. పోలీసుల టెర్రర్ ను ఎంతో బాగా రాశారు. అడవుల్లో ఏళ్ళ తరబడి ఉండి నిజాం దళాలకు, ఆ తర్వాత భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ యోధులకు గొప్ప నివాళి వంటిది ఈ పుస్తకం. ఈ పుస్తకం చదవకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి కానీ సమైక్యాంధ్ర ఆందోళన గురించి కానీ మాట్లాడడం అపరిపక్వతే అవుతుంది.

రచయిత పుచ్చలపల్లి సుందరయ్య నిరంతర అధ్యయన చేసేవారు. నిరాడంబరుడు. ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్ళినా ఆయన లోక్ సభకు సైకిల్ మీద వెళ్ళేవారు. ఆ గొప్ప ప్రజానాయకుడు రాసిన ఈ పుస్తకం అందరూ చదువదగినది.
Telangana People's Struggle And Its Lessons @ 5% discount by P.Sundarayya

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+