మాజీ నక్సలైట్ నయీమ్ మరణించాడా?

తాను ఎకె 47 రైఫిల్ను నయీమ్ కోసం తెచ్చినట్లు ఆయుధాల అక్రమ రవాణా కేసులో అరెస్టైన నగరానికి చెందిన హిజ్బుల్ ముజహిదీన్ కార్యకర్త ముజీబ్జ అహ్మద్ పోలీసులకు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. సొహ్రబుద్దీన్ షేక్ అచూకీని నయీమ్ పోలీసులకు చేరవేసినట్లు కూడా అనుమానాలున్నాయి. సొహ్రబుద్దీన్ను గుజరాత్ పోలీసులు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. 2005లో పౌర హక్కుల నేతల హత్యలకు కూడా నయీమ్ కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్ అనే పేరు మీద వారిని హతమార్చింది నయీమ్ ముఠానే అని పౌర హక్కుల నాయకులు ఆరోపిస్తూ వచ్చారు.
గత కొద్ది కాలంగా కోబ్రాస్ మాట వినిపించడం లేదు. అసలు నయీమ్ ఎక్కడున్నాడనే విషయం మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ నిరుటి వరకు హైదరాబాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దండిగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, నయీమ్ పక్షవాతానికి గురై మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను కేరళలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆంగ్ల దినపత్రిక రాసింది. అయితే, నయీమ్ ఇంకా చురుగ్గానే ఉన్నాడని, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యే అందుకు నిదర్శనమని అనేవాళ్లు కూడా ఉన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications