భాను కిరణ్ లింక్స్: చిక్కుల్లో రేవంత్ రెడ్డి?

హెచ్ఎంటివి వార్తాకథనం ప్రకారం - ఎన్నారై సునీతకు చెందిన మహబూబ్నగర్ జిల్లాలోని టకరాజ్గుడాలోని 25 ఎకరాల భూమిని భాను కిరణ్ మరో వ్యక్తి పేరు మీద రిజిష్టర్ చేయడానికి రేవంత్ రెడ్డి సహకరించారని సిఐడి గుర్తించింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని విచారించే యోచనలో సిఐడి ఉంది. అయితే, ఆయనను సాక్షిగా పిలువాలా, నిందితుడిగా పిలువాలా అనే సందిగ్ధంలో సిఐడి ఉంది.
ఇంకా ఆ వార్తాకథనం ఇలా తెలియజేసింది - సునీత తండ్రి బోజిరెడ్డి ఆ భూమిని నర్సింగరావు, తదితరుల నుంచి కొన్నాడు. బోజిరెడ్డి మరణం తర్వాత 2006 ఆ భూమిని తన అనుచరుల పేరు మీద రిజిష్టర్ చేయించడానికి భాను కిరణ్ ప్రయత్నించాడు. అయితే, అది సాధ్యం కాలేదు. మళ్లీ 2009లో ప్రయత్నించి శివశేఖర రెడ్డి పేరు మీద దాన్ని రిజిష్టర్ చేయించాడు. ఇందుకు రేవంత్ రెడ్డి సహకరించారని సిఐడి అధికారులు గుర్తించారు.
సునీతను అమెరికా నుంచి పిలిపించడంలో, పత్రాలను భాను కిరణ్ చేతికి చేర్చడంలో, భూమిని రిజిష్టర్ చేయించుకునే విషయంలో ఇబ్బందులు రాకుండా చూడడంలో మాత్రమే రేవంత్ రెడ్డి సహకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఇందులో తనకు ఏ విధమైన ప్రమేయం లేదని, తెలిసినవాళ్లకు సహకరించే పని మాత్రమే తాను చేశానని రేవంత్ రెడ్డి అంటున్నట్లు కూడా ఆ వార్తాకథనం తెలిపింది.
అయితే, ఇదే వార్తాకథనాన్ని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ కూడా ప్రసారం చేసింది. కానీ, ఈ చానెల్ రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. స్థానిక నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఈ చానెల్ వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications