కృష్ణం వందే జగద్గురమ్లో కెసిఆర్ భార్య (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం, సర్వార్థ సంక్షేమ సమితి సంయుక్త్ధ్వార్యంలో హైదరాబాదు నగరంలోని టిటిడి కల్యాణ మండపంలో ‘కృష్ణం వందే జగద్గురుం శ్రీ మద్భాగవత సప్తాహం 'శుక్రవారం ప్రారంభమైంది. పరమహంస, పరివ్రాజకాచార్య, జగద్గురు, శ్రీ సిద్దేశ్వరి పీఠాధిపతి- కుర్తాళం శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామీ భాగవత ప్రవచనములు ప్రారంభమయ్యాయి.
ఈనెల 21వరకు జరగనున్న కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణచారి అతిధులుగా హజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణి శోభ హాజర్యాయురు హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్రావు, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, సర్వార్థ సంక్షేమ సమితి అధ్యక్షుడు పివి మనోహర్రావు హజరయ్యారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు మహాభారత ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం సందేశాత్మకం అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భక్తిపర్వంతో యాదగిరి గుట్ట ఆలయాన్ని ప్రసిద్ధి చేయటానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

దేవాలయాల అభివృద్ధికి కృషి
తెలంగాణలోని దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. న్యాయమూర్తి నూతి రామ్మోహన్రావు మాట్లాడుతూ భక్తిమార్గం ద్వారా భగవంతుడ్ని చేరుకోవటం సులభం అన్నారు.

భక్తి మార్గానికి...
భక్తిమార్గానికి, భాగవతానికి మంచిన సులువైన మార్గం లేదని
కమిషనర్ శివశంకర్ అన్నారు. దైవజ్ఞశర్మ మాట్లాడుతూ జీవనముక్తికి భాగవతం మార్గమని, సద్గతికి భాగవతం మార్గం సుగమం చేస్తుందన్నారు.

దేవుడున్నాడన్న భావన
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి స్వాగతోపన్యాసం చేస్తూ భక్తి భావన పెంపొందించేందుకు, ఈ రోజుల్లో దేవుడున్నాడన్న భావన పెంచటంతోపాటు ప్రజల్లో ఆధ్యాత్మిక పెంపొందించేందుకు ఈ ప్రవచన కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయని చెప్పారు.

అభిభాషణ
భక్తజనాన్ని ఉద్ధేశించిన స్వామీజి అనుగ్రహభాషణం చేశారు. వ్యాస మహార్షి సంస్కృతంలో అందించిన భాగవతంను బమ్మెర పోతన తెలుగులో అనువదించినట్లు తెలిపారు. భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రవచనాలు కొనసాగుతాయని నిర్వాహకులు పివి మనోహర్రావు వెల్లడించారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications