దసరా: పిల్లాపాపలతో కదిలిన సిటీ జనం(పిక్చర్స్)
హైదరాబాద్: దసరా పర్వదినం(అక్టోబర్ 3న) పురస్కరించుకుని నగరంలో నివాసముంటున్న చాలా మంది ప్రజలు తమ తమ స్వస్థలాకు బయల్దేరుతున్నారు. దీంతో నగరంలో క్రమక్రమంగా జన సందడి తగ్గిపోతోంది. మూటముళ్లే, పిల్లాపాపలతో ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలివెళుతున్నారు. ఆర్టీసి, ప్రైవేటు బస్సులు, రైళ్లలలో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు.
కాగా, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రీమియం పేరిట అదనపు వసూళ్లకు శ్రీకారం చుట్టడంతో పౌరుల్లో పండుగ సంతోషం టికెట్లు బుక్ చేసుకున్నప్పుడే ఆవిరవుతోంది. గతంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపినప్పటికీ.. ఈ సారి మాత్రం ప్రీమియం పేరిట బెర్తుల వ్యాపారాన్ని మొదలెట్టింది. ఇక్కడి సంస్కృతి, సంప్రయాదాలకు బతుకమ్మ పండుగను ప్రతీకగా ప్రకటించిన తెలంగాణ సర్కారు మునుపెన్నడు లేని రీతిలో 15 రోజుల సెలవులు ప్రకటించింది.
ప్రైవేట్ క్లాసులు, ప్రత్యేక తరగతుల పేరిట చదువులు చెప్పొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దాదాపు అన్ని పాఠశాలలు పండుగ సెలవులు ప్రకటించాయి. దీంతో గతంతో పోలిస్తే గ్రామాలకు తరలుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఆయా జిల్లాలకు వెళ్లే బస్సులు జూబ్లీ, సీబీఎస్, ఎస్ఆర్నగర్, కేపీహెచ్బీ, ఈసీఐఎల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. దసరాకు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ తదితర జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, ఏలూరు, కొవ్వూరులకు ప్రజలు తరలి వెళ్తున్నారు. దీంతో ప్రైవేట్ బస్సులకూ డిమాండ్ పెరిగింది.

తరలుతున్న జనం
దసరా పర్వదినం(అక్టోబర్ 3న) పురస్కరించుకుని నగరంలో నివాసముంటున్న చాలా మంది ప్రజలు తమ తమ స్వస్థలాకు బయల్దేరుతున్నారు. దీంతో నగరంలో క్రమక్రమంగా జన సందడి తగ్గిపోతోంది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో..
మూటముళ్లే, పిల్లాపాపలతో ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలివెళుతున్నారు. ఆర్టీసి, ప్రైవేటు బస్సులు, రైళ్లలలో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో..
కాగా, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రీమియం పేరిట అదనపు వసూళ్లకు శ్రీకారం చుట్టడంతో పౌరుల్లో పండుగ సంతోషం టికెట్లు బుక్ చేసుకున్నప్పుడే ఆవిరవుతోంది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో..
గతంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపినప్పటికీ.. ఈ సారి మాత్రం ప్రీమియం పేరిట బెర్తుల వ్యాపారాన్ని మొదలెట్టింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో..
ఇక్కడి సంస్కృతి, సంప్రయాదాలకు బతుకమ్మ పండుగను ప్రతీకగా ప్రకటించిన తెలంగాణ సర్కారు మునుపెన్నడు లేని రీతిలో 15 రోజుల సెలవులు ప్రకటించింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో..
ప్రైవేట్ క్లాసులు, ప్రత్యేక తరగతుల పేరిట చదువులు చెప్పొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

పిల్లాపాపలతో..
దీంతో దాదాపు అన్ని పాఠశాలలు పండుగ సెలవులు ప్రకటించాయి. దీంతో గతంతో పోలిస్తే గ్రామాలకు తరలుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications