మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం (ఫోటోలు)
హైదరాబాద్: 'డివైన్ వాయిస్' పేరిట డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ సంగీత కచేరిని వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ డా. టి. సుబ్బరామిరెడ్డి ఆయనకు అక్కినేని స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేసి, అభినందించారు.
ఈ సందర్భంగా టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ 85 సంవత్సరాల వయస్సులోనూ స్వరంలో ఏమాత్రం వృద్దాప్యం కనపడనీయకుండా గానామృతాన్ని అందించడం చాలా గొప్ప విషయమన్నారు. స్వరబ్రహ్మా బాలమురళీకృష్ణకు భారతరత్న ఇవ్వాలని తెలుగువారమంతా పట్టబడదాం, కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
బాలమురళీకృష్ణకు సంపూర్ణ ఆయుస్సు ఇవ్వాలని జగన్మాతను పలునామాలతో టి.సుబ్బరామిరెడ్డి స్మరించాడు. కళాభారతి, సినీనటి జమున మాట్లాడుతూ బాలమురళీకృష్ణ సరస్వతి పుత్రుడు, మహానుభావుడు అని కొనియాడుతూ పాదాలకు నమస్కరించారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాంస్కృతిక సలహాదారుడు కెవి రమణాచారి మాట్లాడుతూ త్యాగరాజస్వామిని చూడలేకపోయామని బాధపడనవసరం లేదని బాలమురళీకృష్ణలో ఆయన్నిచూడవచ్చని అన్నారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
చివరగా స్వరబ్రహ్మా బాలమురళీకృష్ణ మాట్లాడుతూ తనను ఇంతకాలం ఆదరించి అభిమానిస్తున్నారని ఇదే ఆదరణ తాను ఉన్నంతకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి శిరోమణి వంశీ రామరాజు స్వాగతం పలుకగా తెన్నేటి సుధాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
అంతక ముందు వేదికపై మంగళంపల్లి బాలమురళీకృష్ణ కొన్ని నిమిషాలు రామదాసుగా మారిపోయి ‘పలుకే బంగారమాయెరా.. కోదండపాణి..' అంటూ ఆనంద భైరవి రాగంలో కీర్తనను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను రంజింప చేశారు. బెహాగ్ రాగంలో ‘నారాయణచే నమో నమో..' అన్నమాచార్య కీర్తనను ఆలపించారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
సామ రాగంలో ‘శ్రీ సకల జనాధిప పాలయమాం..' వరసిద్ధి వినాయక శ్తోత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శోభిల్లు సప్తస్వర కీర్తనలో స్వరాలను ఆలపిస్తూ సహగాయకులు కృష్ణకుమార్, ఈలపాట శివప్రసాద్తో పోటీపడుతూ ఆలపించారు. అనంతరం సంగీతమే వరసుఖదాయమా కీర్తనను ఆలపించి శ్రోతలను సంగీత ప్రపంచంలో విహరింపజేశారు.
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications