ఐఐఎంబీ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా దీపికా పదుకొనె
శనివారం బెంగళూరు నగరంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు(ఐఐఎంబీ) అలమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐఎంబీ లీడర్ షిప్ సమ్మిట్ 2016లో ఆమె పాల్గొన్నారు.
బెంగళూరు: ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె ఎప్పుడు తన సొంత నగరం బెంగళూరుకు వచ్చినా.. ఘన స్వాగతం లభిస్తుంది. శనివారం నగరంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు(ఐఐఎంబీ) అలమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐఎంబీ లీడర్ షిప్ సమ్మిట్ 2016లో ఆమె పాల్గొన్నారు. ఆమె రాకతో కార్యక్రమానికి భారీగా అభిమానులు చేరుకున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్, మణిపాల్ ఎడ్యుకేషన్ ఛైర్ పర్సన్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ కూడా హాజరయ్యారు. కాగా, దీపికను వేదికపైకి ఆహ్వానించే సమయంలో ఐఐఎంబీ బోర్డ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్.. మన దీపిక పదుకొనె అంటూ సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సీనియర్ ఎడిటర్ శేఖర్ గుప్తా ఆమెతో ముఖాముఖి నిర్వహించారు. మానసిక సమస్యలు, ఒత్తిడిని ఎలా జయించానో ఈ సందర్భంగా దీపికా పదుకొనే వివరించారు. ఏదైనా కోరిక ఉంటేనే దానికి మార్గం దొరుకుతుందని చెప్పారు.
రాజకీయ ఒత్తిళ్లపై ఎక్కువగా సినీతారలు మాట్లాడరు, ఎందుకు అని ప్రశ్నించగా.. ఏదైనా సమస్య ఉన్నప్పుడు తాను మాట్లాడతానని చెప్పారు. ఒత్తిడిలో మాట్లాడేందుకు ఇష్టపడతానని చెప్పారు. పలు సందర్భాల్లో బాలీవుడ్ కూడా బలిపశువు అవుతోందని అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications