'టి' ప్రతులు అర్ధరాత్రి ఇలా ఎగిరెళ్లాయి (పిక్చర్స్)
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన జరిగిన చర్చపై నివేదిక సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. ఎయిర్ ఇండియా విమానంలో నివేదికను అధికారుల బృందం ఢిల్లీకి తీసుకెళ్లింది.
బిల్లు కాపీలతో ఉప కార్యదర్శి లలితాంబిక నేతృత్వంలో తొలి బృందం ఢిల్లీ చేరింది. ఆ తర్వాత మరికొన్ని బిల్లు ప్రతులతో జిఏడి అధికారులు చేరుకున్నారు.
విభజన బిల్లుపై శాసన సభలో జరిగిన చర్చపై నివేదిక ఆదివారం రాత్రి సిద్ధమైంది. మూడు రోజుల కసరత్తు అనంతరం సమగ్ర నివేదికను రూపొందించారు. మరోవైపు నేతలు కూడా ఢిల్లీకి క్యూ కట్టారు.
తెలంగాణ 1
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన జరిగిన చర్చపై నివేదిక సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. ఎయిర్ ఇండియా విమానంలో నివేదికను అధికారుల బృందం ఢిల్లీకి తీసుకెళ్లింది.
తెలంగాణ 2
బిల్లు కాపీలతో ఉప కార్యదర్శి లలితాంబిక నేతృత్వంలో తొలి బృందం ఢిల్లీ చేరింది. ఆ తర్వాత మరికొన్ని బిల్లు ప్రతులతో జిఏడి అధికారులు చేరుకున్నారు.
తెలంగాణ 3
విభజన బిల్లుపై శాసన సభలో జరిగిన చర్చపై నివేదిక ఆదివారం రాత్రి సిద్ధమైంది. మూడు రోజుల కసరత్తు అనంతరం సమగ్ర నివేదికను రూపొందించారు. మరోవైపు నేతలు కూడా ఢిల్లీకి క్యూ కట్టారు.
తెలంగాణ 4
విభజనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని తెలంగాణ ప్రాంత మంత్రులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ 5
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే నెరవేర్చుతుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చినట్టు టి కాంగ్ నేతలు తెలిపారు. కాగా తెలంగాణ బిల్లును అర్ధరాత్రి సమయంలో సచివాలయం నుండి విమానాశ్రయానికి తరలిస్తున్న దృశ్యం.
తెలంగాణ 6
విభజన బిల్లును శాసనసభ తిరస్కరించడంతో తలెత్తిన పరిణామాలపై దిగ్విజయ్ సింగ్తో సంప్రదింపులు జరిపేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వచ్చారు. కాగా తెలంగాణ బిల్లును అర్ధరాత్రి సమయంలో సచివాలయం నుండి విమానాశ్రయానికి తరలిస్తున్న దృశ్యం.
తెలంగాణ 7
దిగ్విజయ్తో సుదీర్ఘ చర్చలు ముగిసిన తర్వాత మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, డి.కె.అరుణ విలేఖర్లతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నిలువరించటం ఎవరి తరం కాదని, విభజన బిల్లును సమర్ధిస్తామని ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకుంటుందని వీరు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ బిల్లును అర్ధరాత్రి సమయంలో సచివాలయం నుండి విమానాశ్రయానికి తరలిస్తున్న దృశ్యం.
తెలంగాణ 8
రాజ్యాంగంలోని మూడవ అధికరణ సాయంతో తెలంగాణ రాష్ట్ర ఎర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డికె అరుణ చెప్పారు. కాగా తెలంగాణ బిల్లును అర్ధరాత్రి సమయంలో సచివాలయం నుండి విమానాశ్రయానికి తరలిస్తున్న దృశ్యం.
తెలంగాణ 9
విభజనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైనట్టు తెలియడంతో సీమాంధ్ర నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో పడ్డారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
తెలంగాణ 10
సుప్రీం కోర్టులోని పలువురు న్యాయవాదులకు సీమాంధ్ర నాయకులు డబ్బులు వెదజల్లి తెలంగాణకు న్యాయవాదులు లభించకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఢిల్లీలోని ఎపి భవన్లో తెలంగాణ బిల్లు ప్రతుల దృశ్యం.
తెలంగాణ 11
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన జరిగిన చర్చపై నివేదిక సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. ఎయిర్ ఇండియా విమానంలో నివేదికను అధికారుల బృందం ఢిల్లీకి తీసుకెళ్లింది. కాగా, ఢిల్లీలోని ఎపి భవన్లో తెలంగాణ బిల్లు ప్రతుల దృశ్యం.
తెలంగాణ 12
బిల్లు కాపీలతో ఉప కార్యదర్శి లలితాంబిక నేతృత్వంలో తొలి బృందం ఢిల్లీ చేరింది. ఆ తర్వాత మరికొన్ని బిల్లు ప్రతులతో జిఏడి అధికారులు చేరుకున్నారు. కాగా, ఢిల్లీలోని ఎపి భవన్లో తెలంగాణ బిల్లు ప్రతుల దృశ్యం.