వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యకు రహదారి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు శాసనసభ సమావేశాలు ఏ మాత్రం ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు నిరాహార దీక్ష వల్ల తలెత్తిన పరిణామాల వల్ల, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల శాసనసభ సమావేశాలు జరగలేదు. ఎజెండా ఏదీ చేపట్టకుండానే శాసనసభ అర్థాంతరంగా ముగిసింది. అయితే ఈసారి శాసనసభ సమావేశాలు కచ్చితంగా జరగాల్సి ఉంటుంది. బడ్జెట్ ను ప్రవేశపెట్టి, ఆమోదం పొందడానికైనా శాసనసభ సమావేశాలు జరగాల్సి ఉంటుంది. అందువల్ల రోశయ్య చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు. జిల్లాలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ శాసనసభ్యులు సభలో సరిగా వ్యవహరించేందుకు అవసరమైన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుంటున్నారు.

సోమవారం ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశం కూడా అందులో భాగమేనని అంటున్నారు. మంత్రులు ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన మంత్రులకు సూచించారు. ఇబ్బంది కలగకుండా సమన్వయంతో వ్యవహరించాలని కూడా ఆయన సూచించారు. శాసనసభ్యులను గ్రూపులుగా విభజించి అంశాలవారీగా వారిని వివిధ విషయాల్లో అధ్యయనం చేసేలా చూడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రకంగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి తన పని సజావుగా సాగేలా చూసుకోవాలని ఆయన అనుకుంటున్నారు.

ఇదే సమయంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం రోశయ్యకు సహకరించేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెసు అధిష్టానం పిసిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. పిసిసికి, ప్రభుత్వానికి మధ్య సమన్వయానికి ఇది పని చేస్తుంది. ఈ కమిటీలో వైయస్ జగన్ కు, ఆయన మంత్రవేత్త కెవిపి రామచందర్ రావుకు స్థానం కల్పించింది. దానివల్ల వైయస్ జగన్ వర్గం అనివార్యంగా రోశయ్యకు సహకరిస్తుందనేది కాంగ్రెసు అధిష్టానం భావన. బాధ్యతలు అప్పగించిన తర్వాత జగన్ తన వర్గాన్ని రోశయ్యకు వ్యతిరేకంగా పని చేయించలేరనేది అధిష్టానం ఆలోచన. కాగా, తెలంగాణపై కూడా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను, నివేదికకు కాలపరిమితిని నిర్దేశించడం ద్వారా ప్రాంతాలవారిగా పార్టీ శాసనసభ్యులు విడిపోకుండా చూడాలనే ఆలోచన కూడా చేస్తోంది. ఈ కమిటీ విధివిధానాలు, కాలపరిమితి ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూసి రోశయ్య ప్రభుత్వ పనికి ఆటంకం కలగకుండా చూడాలనేది కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆలోచనగా చెప్పవచ్చు. ఏమైనా, రోశయ్య చిట్కాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X