ఎన్నికలు వస్తాయా...

కాంగ్రెసు కున్న 156 ఆధిక్యంలో సుమారు జగన్ వర్గం ఎమ్మెల్యేలు 50 మందికి పైగా ఉన్నారు. కొందరు బాహాటంగానే జగన్ కు మద్దతు పలుకుతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చెయ్యాలని వైఎస్ మృతదేహాన్ని ఖననం చేస్తున్నప్పుడే ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. ఇప్పుడు కొందరు జగన్ వర్గంనుండి తప్పుకున్నప్పటికీ, మిగిలిన వాళ్లు రోశయ్యని దించి జగన్ను ముఖ్యమంత్రిగా చెయ్యడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. వారు మంచి సమయం కోసం వేచి చూస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినట్టు సమాచారం. జగన్ కున్న ప్రజాబలం చూసుకొని తదుపరి ప్రయత్నాలు చెయ్యాలని వారి ఆలోచనగా ఉంది. దీంతో వారు ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా మారి ప్రభుత్వం పడిపోతుందోనని అందరిలోనూ ఉంది.
ఇక గత డిసెంబర్ నుండి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి తెలంగాణవాదులు జీర్ణించుకోలేక పోతున్నరు. తెరాస ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రజల్లో ఉన్న తెలంగాణ భావం ఉవ్వెత్తున ఎగిసి ఈ సమయంలో తెలంగాణకు అనుకూలంగా లేకపోతే తెలంగాణలో తమ పార్టీలు కనిపించకుండా పోవటం ఖాయమన్న భావన ఆయా పార్టీల్లో నెలకొంది. అందుకే తెలంగాణకు తాము అనుకూలమంటూ తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ ప్రరాప, తెలంగాణ తెలుగు దేశమంటూ కొత్తగా తెరపైకి వచ్చాయి. ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణకు మొదటినుండి అనుకూలమే. తెలంగాణ కాంగ్రెసు, తెదేపాలు తమ పార్టీ అధిష్టానం నిర్దిష్ట వైఖరి చెప్పనప్పటికీ తాము తెలంగాణకు అనుకూలమేనంటూ ప్రకటలను గుప్పిస్తున్నారు. లోక్ సత్తా, ప్రరాప తెలంగాణ నాయకులు తమ అధినేతలు తెలంగాణకు అనుకూలమైతేనే వారిని సమర్థిస్తామని నిక్కచ్చిగా చెబుతున్నారు. ఇలా తెలంగాణలో తమ పార్టీని నిలబెట్టుకొనడానికి వారు ప్రజల్లోకి వెళుతున్నరు.
ఎందుకంటే తెరాస అధినేత కెసిఆర్ డిసెంబర్ 31 తరువాత తెలంగాణ ప్రకటించకుంటే అంతర్యుద్దం ప్రారంభమవుతుందంటున్నారు. అతనికి సపోర్టుగానన్నట్టు అన్ని పార్టీలు ఆ రాగాన్నే అందుకుంటున్నాయి. అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్న జగన్, తెలంగాణ సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయి ఎన్నికలు రావచ్చుననే ఆలోచన దృష్ట్యా పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి.












Click it and Unblock the Notifications