ఇక చిరంజీవి, జగన్ పోటా పోటీ!

తిరుపతిలో భారీ సమీకరణకు కొన్ని అవాంతరాలు ఉన్నాయని పిఆర్పీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో గానీ గుంటూరులో గానీ సభను పెడితే జనసమీకరణకు అనువుగా ఉంటుందని చెబుతున్నారు. వచ్చేనెల పదో తేదీన విలీన సభను ఏర్పాటు చేయాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాహుల్గాంధీ హాజరవుతారని పీఆర్పీ నేతలు చెబుతున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి సోమవారం సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ సభలోగా కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విలీనానికి గుర్తుగా ముందుగా రాష్ట్ర స్థాయిలో గాంధీభవన్లో సీఎం కిరణ్, పిసిసి అధ్యక్షుడు సత్తిబాబు సమక్షంలో చిరంజీవి కాంగ్రెస్లో తమ పార్టీని కలిపినట్లు ప్రకటిస్తారు.
తర్వాత ఇదే విధానాన్ని జిల్లా స్థాయిలో డిసిసి కార్యాలయాల్లో జిల్లాస్థాయి నేతలు అమలు చేస్తారు. ఇలా మండల, గ్రామస్థాయి వరకూ విలీన కార్యక్రమాలను నిర్వహిస్తారు.క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, పిఆర్పీ నేతలు అవగాహనకు వచ్చిన తర్వాత భారీస్థాయిలో బహిరంగసభ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎఐసిసిఅధ్యక్షురాలు సోనియాగాంధీ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయేందుకు వీలుగా కార్యక్రమాన్ని రూపొందించాలి. అందువల్ల రాత్రివేళల్లో విమాన రాకపోకలకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని పిఆర్పీ నేతలు అంటున్నారు. ఇందుకు విజయవాడ - గుంటూరు మాత్రమే అనువని అంటున్నారు. రాజమండ్రిలో సభ పెట్టాలన్న యోచనలో కొందరు ఉన్నారు. కాని.. దీనికి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications