వైయస్ జగన్ వర్గంపై చర్యలు షురూ!

కాంగ్రెసు టిక్కెట్ పై గెలిచి జగన్ పంచన పార్టీ నేతలు చేరటంతో ఇతర పార్టీలు సైతం ఆ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని, పార్టీ నుండి కుప్పిగంతులు నిరోధించే దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్లీనరీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియో ఫుటేజిలను అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. ఇప్పటికే నలుగురు జగన్ వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కాంగ్రెసు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇప్పటికే నోటీసులు పంపించిన నలుగురు శాసనసభ్యులపై వేటు వేయడం ద్వారా మిగిలిన శాసనసభ్యులను కాపాడుకునే దిశలో పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications