చిరు తీరుపై అప్పుడో మాట ఇప్పుడో మాట!

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించిన వాసిరెడ్డి చిరంజీవి వల్లే తనకు రాజకీయ ఇమేజ్ వచ్చిందని చెబుతూనే ఆయనతో మాత్రం కాంగ్రెస్లోకి వెళ్లనని కుండబద్దలు కొడుతున్నారు. ఆమెకు కేవలం కాంగ్రెస్ విలీనంపై విముఖత ఉంటే నెల పది రోజుల క్రితం చిరంజీవి న్యూఢిల్లీ నుండి విలీనం ప్రకటన చేసినప్పుడే ఆమె చిరంజీవితో విభేదించాల్సి ఉండాల్సింది. కానీ ఆమె అలా చేయలేదు. మరోకొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చిరంజీవి తనకు తప్పనిసరిగా టిక్కెట్ ఇస్తారనే భావనలో ఉన్న వాసిరెడ్డి పద్మ అనుభవజ్ఞుడు అయిన సి.రామచంద్రయ్యకు ఇవ్వడంతో పూర్తిగా నిరాశకు లోనయినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు టిక్కెట్ వస్తుందని ఆశతో ఉన్న ఆమె టిక్కెట్ రాలేదన్న నిరాశతోనే కాంగ్రెస్తో విలీనాన్ని ఇప్పటికిప్పుడు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా తాను మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరతానని కూడా స్పష్టం చేశారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం ప్రకటన చేసిన తర్వాత ఆ పార్టీ నేత శోభారాణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో వాసిరెడ్డి పద్మ శోభారాణిపై విరుచు పడ్డారు. చిరంజీవి అభిప్రాయంతో అందరం ఏకీభవిస్తున్నామని, అది సరియైన నిర్ణయమని చెప్పారు. ఆమెకు ఏమూలో కాంగ్రెస్ పార్టీతో విలీనం ఇష్టం లేకుంటే శోభారాణి వ్యాఖ్యలకు మద్దతు తెలపడమో లేక కామ్గా ఉండటమో చేసేవారని, కానీ శోభారాణి వ్యాఖ్యలపై ధీటుగా స్పందించి విలీనం తప్పులేదని చెప్పారని, కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ సీటు రామచంద్రయ్యకు ఖరారైన తర్వాత మాత్రం ఆమె ధోరణిలో తేడా వచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ సీటు రాకపోవడంపై వాసిరెడ్డి పద్మతో పాటు పలువురు ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం వలన తాము వెనుకబడిపోయే అవకాశం ఉందని కూడా మరికొందరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications