కెసిఆర్కు వైయస్ జగన్ గుబులు

కానీ, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకే కాదు, కెసిఆర్కు కూడా దిమ్మ తిరిగే విధంగా వైయస్ జగన్ తెలంగాణలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జై తెలంగాణ నినాదంతో ఆయన తెలంగాణలో కాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే, తెరాస కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కెసిఆర్ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాదని కెసిఆర్ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కానీ, తెలంగాణ ప్రజలకు కెసిఆర్ను బలపరచడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు జై తెలంగాణ నినాదంతో జగన్ ముందుకు వస్తే అన్ని పార్టీలూ తుడిచిపెట్టుకు పోయినా ఆశ్చర్యం లేదు.
కెసిఆర్కు రెడ్లు చాలా వరకు దూరంగానే ఉన్నారు. జగన్ తెలంగాణ నినాదంతో ముందుకు వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే కాదు- తెరాస నాయకులు, కార్యకర్తలు కూడా జగన్కు జై కొట్టడం ఖాయం. రెడ్లు చాలా వరకు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే వెళ్తారు. కేవలం తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మాత్రమే వైయస్ జగన్కు ఆటంకంగా ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలో కూడా విశేష మద్దతు, ఆదరణ ఉంది. తెలంగాణ సమస్యను జగన్ పరిష్కరించుకోగలితే మిగతా పార్టీలకు ఆయన సింహస్వప్నం కావడం ఖాయం.
వైయస్ జగన్ ఇతర పార్టీలతో పొత్తుకు కూడా ముందుకు వచ్చే సూచనలు లేవు. తెరాసతో ఆయన పొత్తు పెట్టుకుంటారనేది ఉత్త మాటే. సొంత బలం మీద, ప్రజాదరణ మీద ఆధారపడి ఆయన ఇతర రాజకీయ పార్టీలను మట్టి కరిపించే లక్ష్యంతోనే ఉన్నారు. అందువల్ల తెలంగాణ సమస్యను పరిష్కరించుకుని ముందుకు వచ్చేందుకే రంగం సిద్దం చేసుకుంటున్నారని అంటున్నారు. అదే భయం కెసిఆర్ను ఇప్పుడు వెన్నాడుతోందని చెప్పవచ్చు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications