కిరణ్ ప్లాన్, వైయస్ జగన్ బలానికి టెస్టు

మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బలాలు కూడా ఏమిటో తెలిసిపోతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి ఉప ఎన్నికలకు వ్యూహరచన చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకోవడం ద్వారా ప్రత్యర్థులను, అంటే ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేయాలనే వ్యూహం కూడా అందులో దాగి ఉందని చెబుతున్నారు. సీమాంధ్రలోని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటితే వైయస్ జగన్ను ఉప ఎన్నికల్లో దెబ్బ తీయడానికి తగిన ప్రాతిపదిక ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పోలవరం టెండర్ల వివాదం వల్ల నైతికంగా దెబ్బ తిన్నారని కాంగ్రెసు నాయకత్వం అభిప్రాయపడుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం టెండర్ల విషయంలో కెసిఆర్ను దెబ్బ తీయడానికి తగిన ఏర్పాట్లే చేశారని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు కూడా మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా సమీక్షా సమావేశాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కనీసం మూడు నెలలైనా ఉప ఎన్నికలకు సమయం ఉంటుంది. మున్సిపల్ పోల్స్ ఫలితాల వల్ల జిల్లా స్థాయిల్లో పార్టీ శ్రేణుల సమీకరణాలు కూడా అర్థమవుతాయి. దాంతో శ్రేణులను కూడగట్టుకునే ప్రయత్నాలకు పూనుకోవచ్చుననేది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటు వేస్తే రాష్ట్రంలో 26 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. వీటిలో సత్తా చాటితే 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి తగిన నైతిక బలం, ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా కాంగ్రెసు కార్యకర్తలు క్రియాశీలం కావడానికి తోడ్పడుతుందనే అసలు ఆలోచన.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications