అసదుద్దీన్కు షాక్, అందుకే కెసిఆర్తో భేటీ?

మైనార్టీల అభివృద్ధికి సచార్ కమిటీ చేసిన సిఫార్సుల విశ్లేషణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జూబ్లీహాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలను తీసుకు పోవాల్సి వచ్చింది. ఇందుకు కోసం ఎంఐఎం జనసమీకరణ చేస్తుండగా స్థానిక తెలంగాణవాదులు ఎంఐఎం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తాము కార్యక్రమానికి వస్తామని అసదుద్దీన్కు చెప్పారట. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారట. పాతబస్తీ వాసుల్లో తెలంగాణ సెంటిమెంటు ఉండటాన్ని చూసి అసదుద్దీన్ ఆశ్చర్యపోయారట! ఈ కారణంగానే ఆయన కెసిఆర్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పాతబస్తీవాసుల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉందనే అభిప్రాయానికి ఎంఐఎం వచ్చిందని తెలుస్తోంది. దీంతో తెలంగాణపై పార్టీ పునరాలోచించనున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications