వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి భవిష్యత్తు ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కాంగ్రెసు పార్టీలో చిరంజీవి భవిష్యత్తు ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపై విరివిగా చర్చ జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఆయనదే తుది నిర్ణయం. ఏ విధమైన నిర్ణయం తీసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ ఉండేది. పార్టీని నడిపినా, నడపలేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. తన ఇష్టప్రకారం నడుచుకోవడానికి వీలుండేది. కానీ చిరంజీవి ఇప్పుడు ఆ స్వేచ్ఛను కోల్పోయారు. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం ప్రకారం ఇప్పుడు చిరంజీవి నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే, పార్టీని ఒంటి చేతి మీద నడపాల్సిన బరువు మాత్రం ఉండదు. ఆయన పార్టీని నడపే బరువును దింపుకున్నారు. దీంతో చిరంజీవి ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఆయనది ఓ సందిగ్ధ పరిస్థితే. భవిష్యత్తు ఏమవుతుందో లేదో తెలియదు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు ఇచ్చిన మాట మీద నిలబడతారో లేదో తెలియదు.

చిరంజీవికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన హామీలేమిటో, ఆయనకు వేయదలుచుకున్న కుర్చీ ఏమిటో తెలియదు. కానీ అత్యంత ప్రముఖమైన పదవి లేదా బాధ్యత మాత్రం చిరంజీవికి వస్తుందని అంటున్నారు. చిరంజీవికి అనూహ్యమైన పదవి లభిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తారని, పార్టీ దక్షిణ భారత సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. తానే ప్రచార సారథిని అని చిరంజీవి ప్రకటించుకున్నారు కూడా. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకునే తాత్కాలిక ప్రయోజనం కోసమే కాకుండా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను ఎదుర్కునే దీర్షగాలిక ప్రయోజనం ఆశించి చిరంజీవిని కాంగ్రెసు పార్టీ కులుపున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో ఉండే కుల వైరుధ్యాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా చిరంజీవి దీటైన జవాబు ఇవ్వగలరని భావిస్తున్నారు.

కాగా, కాంగ్రెసు పార్టీలో తనతో ఇప్పటి వరకు ఉన్నవారందరికీ సముచిత స్థానం లభిస్తుందని చిరంజీవి హామీ ఇస్తున్నారు. కానీ అది ఏ మేరకు సాధ్యమవుతుందో చెప్పలేం. కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని స్థితి ఉంటుంది. ఇప్పటికే కొంత మంది ప్రజారాజ్యం పార్టీ నాయకులు వైయస్ జగన్, చంద్రబాబుల వైపు చూస్తున్నారు. జ్యోతుల నెహ్రూ వైయస్ జగన్ వెంట నడవడానికి నిర్ణయించుకోగా, చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్రా రెడ్డి తెలుగుదేశంలో చేరిపోయారు. తెలంగాణలో చిరంజీవి క్యాడర్, అభిమానులు కెసిఆర్ వైపు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు అనిల్ కుమార్, మహేశ్వర రెడ్డి చిరంజీవితో ఉన్నా, భవిష్యత్తులో ఉంటారా అనేది అనుమానమే. పదవులు వస్తాయనే ఆశతో ఇంకా ఎక్కువ మంది బయటపడడం లేదు. ఒక్కసారి చిరంజీవికి, చిరంజీవితో ఉన్నవారికి లభించే ప్రాధాన్యం నిర్ణయమైతే పరిస్థితులు ఇంకా మారవచ్చు. ఏమైనా, చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తును ఇతరుల చేతిలో పెట్టినట్లే.

English summary
Prajarajyam president Chiranjeevi's decission to merge his party in Congress may cost his political life. He has to depend on Congress high command on h\is political future. Still it is a dilemma what he is going to get Congress high command. this lead to uncertainty in Prajarajyam cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X