జగన్ పార్టీకి ముహూర్త బలం

పార్టీ స్థాపనకు ముహూర్త బలంపై కూడా చర్చ జరుగుతోంది. మార్చి 7వ తేదీన పార్టీని స్థాపిస్తే వైయస్ జగన్కు తిరుగు ఉండదని జోతిష్య పండితులు చెబుతున్నారు. మార్చి 7వ తేదీన పార్టీని స్థాపిస్తే 2034 వరకు జగన్కు మాహా రాజయోగం ఉంటుందట. నిజానికి, ఒక్కసారి అధికారంలోకి వస్తే 40 ఏళ్ల రాజ్యం చేయాలనేది వైయస్ జగన్ అభిమతం. 2014 ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని, ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు వైయస్ రాజ్యం ఉంటుందని ఆయన సభల్లో చెబుతున్నారు. ఈ ముహూర్త బలాన్ని చూసుకునే ఆయన ఈ మాటలంటున్నారు కావచ్చు. మార్చి 7వ తేదీ దాటితే మళ్లీ మే వరకు మంచి ముహూర్తం లేదని జోతిష్య పండితులు అంటున్నారు.
కాగా, ఎన్నికల కమిషన్ వైయస్ జగన్కు ఝలక్ ఇచ్చింది. పార్టీ కోసం ఇచ్చిన ప్రకటన సరిగా లేదని, మరోసారి ప్రకటన ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. దాంతో వైయస్ జగన్ పార్టీని ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించుకోవడానికి మరోసారి ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. వైయస్సార్ పార్టీ పేర జగన్ తన పార్టీ పేరును నమోదు చేయించాలని అనుకుంటున్నారు. పార్టీ జెండా ఇప్పటికే ఖరారైంది. రెండు మూడు రకాల జెండాలను రూపొందించారు. వాటిలో ఒక్కదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వైయస్ఆర్లోని ఇంగ్లీషు పదాల్లో వై యూత్కు, ఎస్ శ్రామికవర్గానికి, ఆర్ రైతాంగానికి సంకేతంగా నిలిచేలా జెండాకు రూపకల్పన చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications