ఉపఎన్నికలు: టిఆర్ఎస్‌కు 'బిజెపి' ఊరట!

Kishan Reddy-K Chandrasekhar Rao
రాష్ట్రంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ ఒక్క సీటుకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల పోటీ చేసే వాతావరణం కనిపించకపోవడంతో ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన మహబూబ్‌నగర్‌కు మాత్రమే పరిమితం కావాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మిగతా స్థానాల్లో పోటీపై ఇంతవరకు నిర్ణయం తీసుకోకుండా కోర్ కమిటీ భేటీ నేడు రేపు అంటూ వాయిదా వేస్తోందన్న అభిప్రాయాలున్నాయి. వాస్తవానికి గురువారం కోర్ కమిటీ భేటీ అయి మిగతా స్థానాల్లో పోటీ విషయాన్ని తేల్చేస్తుందని పార్టీ నేతలు చెప్పారు. కానీ గురువారం సమావేశం జరగలేదు. శుక్రవారం భేటీ అవుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. అదీ లేదు. మిగతా చోట్ల పోటీపై పార్టీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని, అందుకే కోర్ కమిటీ భేటీ అయినా పెద్దగా తేల్చేదేమీ లేదన్న అభిప్రాయాలున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి ఇప్పటికే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. బిజెపి నిర్ణయం టిఆర్ఎస్ కు పెద్ద ఉపశమనమనే చెప్పవచ్చు. బిజెపి స్టేషన్ ఘనపూర్, కామారెడ్డిలలో పోటీ చేయాలని తొలుత భావించింది. అలా పోటీ చేస్తే తెలంగాణవాదుల ఓట్లు చీలి స్టేషన్ ఘనపూర్ లో టిడిపి గట్టెక్కడంతో పాటు కామారెడ్డిలో టిఆర్ఎస్‌కు పెద్ద మొత్తంలో నష్టం జరిగేదని అంటున్నారు. అంతర్గతంగా కూడా రాజీనామా చేసిన వారికి మద్దతివ్వాలని బిజెపి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్‌తో విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణవాదం పేరుతో మద్దతివ్వాలని బిజెపి ఆలోచిస్తుందని తెలుస్తోంది. అదే అయితే టిఆర్ఎస్‌కు పెద్ద ఉపశమనమే.

నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్దన్‌ రెడ్డికే మద్దతు ఇస్తుంది. ఆదిలాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్, కొల్లాపూర్‌లలో బిజెపి పోటీ చేయకపోవచ్చనని తెలుస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థులు జోగు రామన్న, గంప గోవర్ధన్, రాజయ్య, జూపల్లి కృష్ణా రావులకే మద్దతు ఇవ్వడానికి పార్టీ అంతర్గతంగా ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా తెలంగాణ కోసమే పదవులకు రాజీనామా చేసినందున మద్దతివ్వాలని బిజెపిని తెలంగాణ జెఏసి కోరిన విషయం విదితమే. ఈ ఒక్క కారణాన్నే ప్రజలకు చెబుతూ వారికి మద్దతిచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ కారణాన్ని చెప్పడం వల్ల తమకు జెఏసిలో శత్రువుగా మారిన టిఆర్ఎస్ పేరును నేరుగా ఉచ్ఛరించకుండా ఉన్నట్లవుతుందన్నది బిజెపి భావన. అయితే మహబూబ్‌నగర్‌లో తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరినా, టిఆర్ఎస్ అంగీకరించకపోవడం పట్ల బిజెపి గుర్రుగా ఉంది. ఇక్కడ మాత్రం తాడోపేడో తేల్చుకోవాలన్న కృత నిశ్చయంతో బిజెపి ఉందని సమాచారం.

మహబూబ్‌నగర్‌లో పార్టీకి కొంత పట్టు ఉందని, టిఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బిజెపి చెబుతోంది. అందుకే టిఆర్ఎస్ మద్దతు లేకపోయినా శ్రీనివాస్‌ రెడ్డిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వర్‌రావు తెలిపారు. మండలానికి నలుగురు చొప్పున ఇన్‌చార్జులను నియమించే ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బిజెపి పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది. పోటీకి ఇద్దరు నేతలు సుముఖత వ్యక్తం చేసినా మూడు ప్రధాన పార్టీల నుంచి హేమాహేమీలు పోటీ పడుతున్నందున తట్టుకునే శక్తి ఉండదని బిజెపి భావిస్తోందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+