జగన్ మేనమామ నుండి శ్రీధర్ రెడ్డి వరకు...!
విశాఖపట్నం జిల్లాకు చెందిన మరో నేత దొంగ నోట్ల కేసులో చిక్కుకున్నారు. నర్సీపట్నానికి చెందిన నాగ మల్లేశ్వరిని, గుంటూరుకు చెందిన సయ్యద్ బాబిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వల పన్నారు. కానిస్టేబుల్కు రూ.5000 నగదు ఇచ్చి మఫ్టీలో పంపించారు. ఆయన నుంచి నగదు తీసుకున్న నిందితులు రూ.10వేల విలువైన దొంగనోట్లను ఇచ్చారు.
పోలీసులు వెంటనే ఇంటిపై దాడి చేసారు. రూ.50 లక్,ల విలువైన రూ.500 నోట్లు తయారు చేయడానికి సరిపడా రసాయనం పూసిన నల్లటి కాగితాల కటట్లు, రెండు చిన్న క్యాన్లలో రసాయనం పట్టుకున్నారు. నిందితులకు గంజాయీ, పురాతన నాణేలు, రైస్ పుల్లింగ్ నాణేలు వంటి వ్యాపారాలతో సంబంధముందని పోలీసులు తెలిపారు.
జగన్ మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్ర నాథ్ రెడ్డి ఫోర్జరీ కేసులోను, ఎరువుల అక్రమ తరలింపు కేసులో ఉన్నారు. కడప జిల్లా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెద్దచెప్పలి సహకార సొసైటీలో బోగస్ ఓట్లు నమోదు చేయించడానికి ఏకంగా డిసిఓ సంతకాన్నే ఫోర్జరీ చేశారంటూ రవీంద్రనాథ్ రెడ్డిపై కడప వన్టౌన్ పోలీసుస్టేషన్లో పోలీసు కేసు నమోదైంది. ఆయన కోర్టులో లొంగిపోయి జైలుకు వెళ్లి, తర్వాత బెయిల్పై విడుదలయ్యారు.
కడపలో బాలాజీ ఫెర్టిలైజర్స్ పేరుతో రవీంద్రనాథ్ రెడ్డికి ఓ ఎరువుల పరిశ్రమ ఉంది. ఇక్కడి నుంచి పర్మిట్లు లేకుండా లారీల్లో ఎరువులను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదైంది. మద్యం సిండికేట్ వ్యాపారంలో బిగ్షాట్గా ప్రచారంలోకి వచ్చిన నున్నా వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది.