కత్తి చూపిన బాబు: టోపీ పెట్టిన లోకేష్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని గండిపేటలో మూడు రోజులపాటు కోలాహలంగా కొనసాగిన తెలుగుదేశం పార్టీ మహానాడు శుక్రవారం సాయంత్రం ముగిసింది. మూడో రోజు సమావేశంలో తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ఆమోదించిన మహానాడు, పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసింది.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తెలంగాణ సిఎం కెసిఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం. ఖబడ్దార్ కెసిఆర్ ...నీ గుండెల్లో నిద్రపోతా' అంటూ గర్జించారు. దేశంలో మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షించుకోవాలని, తనను గతంలో ఫినిష్ అయిపోతానని అన్నవాళ్లే ఫినిష్ అయిపోయారని అన్నారు.
తమ పార్టీ నుండి ఒక ఎమ్మెల్యే వెళ్లిపోతే వంద మంది ఎమ్మెల్యేలు తయారవుతారని, ఏ పార్టీలోనూ శిక్షణ పొందిన నేతలు లేరని, టిడిపిలో మాత్రమే శిక్షణ పొందిన నేతలు ఉన్నారని చెప్పారు.
తాను ఏదీ తేలికగా మట్లాడబోనని, పట్టుపడితే వదిలే ప్రసక్తే లేదని, ఉడుంపట్టు పడతానని వ్యాఖ్యానించారు. నీతివంతమైన పోరాటం తాను చేస్తున్నపుడు ధర్మపోరాటం చేస్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదనిన్నారు. టిడిపిని తక్కువ అంచనా వేయవద్దని అన్నారు.

చిన్నారితో బాబు
హైదరాబాద్ నగరంలోని గండిపేటలో మూడు రోజులపాటు కోలాహలంగా కొనసాగిన తెలుగుదేశం పార్టీ మహానాడు శుక్రవారం సాయంత్రం ముగిసింది.

చంద్రబాబు
మూడో రోజు సమావేశంలో తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ఆమోదించిన మహానాడు, పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసింది.

రమణ, రేవంత్
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తెలంగాణ సిఎం కెసిఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు
‘తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం. ఖబడ్దార్ కెసిఆర్ ...నీ గుండెల్లో నిద్రపోతా' అంటూ గర్జించారు.

వేదికపై నేతలు
దేశంలో మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షించుకోవాలని, తనను గతంలో ఫినిష్ అయిపోతానని అన్నవాళ్లే ఫినిష్ అయిపోయారని అన్నారు.

కేక్ తినిపిస్తూ..
తమ పార్టీ నుండి ఒక ఎమ్మెల్యే వెళ్లిపోతే వంద మంది ఎమ్మెల్యేలు తయారవుతారని బాబు అన్నారు.

బాబుతో మోత్కుపల్లి
ఏ పార్టీలోనూ శిక్షణ పొందిన నేతలు లేరని, టిడిపిలో మాత్రమే శిక్షణ పొందిన నేతలు ఉన్నారని చెప్పారు.

బాలకృష్ణ
తాను ఏదీ తేలికగా మట్లాడబోనని, పట్టుపడితే వదిలే ప్రసక్తే లేదని, ఉడుంపట్టు పడతానని బాబు వ్యాఖ్యానించారు.

మహానాడు
నీతివంతమైన పోరాటం తాను చేస్తున్నపుడు ధర్మపోరాటం చేస్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదనిన్నారు. టిడిపిని తక్కువ అంచనా వేయవద్దని అన్నారు.

కత్తి చూపుతూ.
టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సైతం టిడిపిలో శిక్షణ పొందిన వాడేనని గతంలో పొత్తు పెట్టుకుంటే టిడిపి మంచిదైపోయిందని, తర్వాత పొత్తు లేకపోయేసరికి చెడ్డది అయిపోయిందని వ్యాఖ్యానించారు.

బాబుతో లోకేష్
టిడిపిని చూస్తే టిఆర్ఎస్కు భయం పట్టుకుందని ఒకరిద్దర్ని రేటు పెట్టి కొన్నంత మాత్రాన టిడిపిని ఏం చేయలేరని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు
రెండు తెలుగు రాష్ట్రాలు సహకరించుకోవాలని, ఇబ్బందులను పరిష్కరించుకోవాలని చంద్రబాబు అన్నారు.

పార్టీకి విరాళం ఇచ్చిన చిన్నారితో
రాజకీయంగా తాము పోరాడతామని, ప్రభుత్వపరంగా తాము సహకరిస్తామని చెప్పారు. ఉస్మానియా భూముల విషయంలో ఊరుకునేది లేదని, పోరు చేసి తీరుతామని అన్నారు.

టోపీ పెట్టిన లోకేష్
ఎప్పటికపుడు టిడిపిని దెబ్బతీయాలని చూస్తున్నారని, కుట్రలు చేస్తున్నారని, అది ఎవరితరం కాదని ఆనాడు ఇలాంటి ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ భూస్థాపితం అయిందని చంద్రబాబు అన్నారు.

లోకేష్
కుట్ర రాజకీయాలు ఎప్పటికీ కలిసి రావని చెప్పారు. టిడిపిని ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టం చంద్రబాబు చేశారు.

నేతలు, కార్యకర్తలు
చిన్నవిషయాలను సైతం గోరంతలు కొండంతలు చేసి కొన్ని మీడియాలు రాస్తున్నాయని, కనుక పార్టీలోని నేతలు అప్రమత్తంగా ఉండాలని, అసత్యాలు రాసిన మీడియాను నిలదీసి ప్రశ్నిస్తామని బాబు చెప్పారు.

నివాళులు
కేంద్రంతో సంబంధాలు అంశం ప్రస్తావిస్తూ, కేంద్రం ఇబ్బందుల్లో ఉన్నా, సహకరించి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉందని అన్నారు.

విజయ సంకేతం
మహానాడులో విజయ సంకేతం చూపుతున్న టిడిపి కేంద్ర కమిటీ అధ్యక్షుడు చంద్రబాబు.

కత్తి చూపుతూ..
మహానాడులో తలపాగా చుట్టి కత్తి చూపుతున్న చంద్రబాబునాయుడు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications