ఈ కథనం దేనికి 'సాక్షి'?

అయితే ప్రజారాజ్యం వల్ల తెలుగుదేశం పార్టీకే పెద్ద నష్టమని ఈ అధికార తెలుగు దిన పత్రిక ప్రచురించడం సమంజసంగా లేదు. చిరంజీవి పార్టీ వల్ల కాంగ్రెస్ కు కూడా భారీగా నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న కాపులు ఇప్పుడు చిరు పార్టీలోకి భారీగా తరలిపోయే అవకాశాలున్నాయి. నాయకుల మాట ఎలా ఉన్నా ఈ మధ్యతరగతి కాపులు నిశ్శబ్దంగా చిరంజీవి పార్టీకి ఓటేయవచ్చన్న సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని, చంద్రబాబు నాయుడిని, టీఅర్ ఎస్ చంద్రశేఖరరావుని కలపడానికి ఒక పత్రికాధిపతి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి పెద్ద దెబ్బే.












Click it and Unblock the Notifications