హైదరాబాద్:
ముఖ్యమంత్రి
డాక్టర్
వైయస్
రాజశేఖర
రెడ్డి
నోట
సినీ
నటుడు
బాలకృష్ణ
పేరు
వచ్చింది.
ఉగ్రవాదంపై
శాసనసభలో
చర్చ
సందర్భంగా
గురువారం
ఆయన
బాలయ్య
పేరును
తెచ్చారు.
తాము
తెలుగుదేశం
పార్టీ
మాదిరిగా
అన్ని
విషయాలను
రాజకీయం
చేయడం
లేదని
అంటూ
బాలకృష్ణ
ఇంట్లో
కాల్పులను
రాజకీయం
చేశామా
అని
అడిగారు.
దీన్ని
బట్టి
ముందు
ముందు
తెలుగుదేశం
పార్టీ
దూకుడును
నిలువరించడానికి,
బాలకృష్ణ
తెలుగుదేశం
పార్టీలో
క్రియాశీలక
పాత్ర
పోషించడాన్ని
తిప్పికొట్టడానికి
బాలకృష్ణ
ఇంట్లో
జరిగిన
కాల్పులను
ముందుకు
తీసుకు
వస్తుందనడానికి
ఇది
సూచిక
అనే
అభిప్రాయం
వ్యక్తమవుతోంది.
1989లో
హైదరాబాదులో
కడపకు
చెందినవారు
మతఘర్షణలకు
పాల్పపడ్డారని
అప్పటి
ముఖ్యమంత్రి
మర్రి
చెన్నారెడ్డి
చెప్పిన
విషయాన్ని
ప్రతిపక్ష
నాయకుడు
నారా
చంద్రబాబు
నాయుడు
గుర్తు
చేశారు.
దీనికి
ప్రతిస్పందనగా
రాజశేఖర
రెడ్డి
తీవ్ర
వ్యాఖ్యలు
చేశారు.
అందులో
భాగంగా
బాలయ్య
ఇంట్లో
కాల్పుల
విషయాన్ని
ముందుకు
తెచ్చారు.
ఏమైనా,
ఈ
కాల్పుల
సంఘటన
బాలకృష్ణ
రాజకీయ
కార్యకలాపాలకు
ఏ
మేరకు
అడ్డుపడుతుందో
వేచి
చూడాల్సిందే.