టిటిడి చైర్మన్ కు చిరు తీర్ధం?

Adikesavulu Naidu
తిరుమల తిరుపతి దేవస్ధానం చైర్మన్ ఆదికేశవులు నాయుడు ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారా? గతంలో తెలుగుదేశం ఎంపీగా గెలిచిన ఆయన యుపిఎ విశ్వాస పరీక్ష సమయంలో యుక్తిగా కాంగ్రెస్ కు ఫేవర్ చేశారు. అందుకు ప్రతిఫలంగా వైఎస్ ఆయనకు టిటిడి ట్రస్టు బోర్డ్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆదికేశవులు నాయుడు ప్రముఖ మద్యం వ్యాపారి. ఆంధ్రలోనే కాకుండా తమిళనాడు, కర్నాటకలలో కూడా ఆయనకు వ్యాపార సామ్రాజ్యాలున్నాయి. ఆయన బలిజ కులస్ధులు. అంటే చిరంజీవి సామాజిక వర్గమే. చిరంజీవి తన పార్టీని ప్రకటించే రోజునే ఆయన ప్రజారాజ్యంలో చేరుతారని విన్పించినా వివిధ కారణాల వల్ల అలా జరగలేదు. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది. టిటిడి చైర్మన్ పదవి మొదట్లో ఆయనకు ఎక్సైటింగా అన్పించినా అక్కడ ఉన్న అంతర్గత రాజకీయాలు ఆయనకు నచ్చడం లేదని చెబుతున్నారు. తన వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవాలంటే ఎంపీగానే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలోని రెండు ఎంఫీ స్ధానాలు ఎస్ సి లకు రిజర్వు కావడంతో ఆదికేశవులుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ లభించడం కష్టమని తేలిపోయింది. టిటిడి పోస్టు ఇచ్చాం కదా, మళ్ళీ ఎంపీ టికెట్ ఎందుకు అన్నట్టు వైఎస్ ఆదికేశవులుకు సంకేతాలు ఇవ్వడంతో ఆ పెద్దాయన మరో పార్టీ టికెట్ కోసం అన్వేషించారు. తన వాళ్ళ పార్టీ అయిన ప్రజారాజ్యం తరఫున ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆదికేశవులు నాయుడు తలచుకుంటే కనీసం వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ వస్తుందన్న ఆశతో ప్రజారాజ్యం అగ్ర నాయకులు ఆయన ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి సాధ్యం కాదు. తమిళనాడు లేదా కర్నాటక లోని ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా గెలిచి వస్తానని ఆదికేశవులు నాయుడు రాయబారాలు పంపుతున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+