టిటిడి చైర్మన్ కు చిరు తీర్ధం?

చిత్తూరు జిల్లాలోని రెండు ఎంఫీ స్ధానాలు ఎస్ సి లకు రిజర్వు కావడంతో ఆదికేశవులుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ లభించడం కష్టమని తేలిపోయింది. టిటిడి పోస్టు ఇచ్చాం కదా, మళ్ళీ ఎంపీ టికెట్ ఎందుకు అన్నట్టు వైఎస్ ఆదికేశవులుకు సంకేతాలు ఇవ్వడంతో ఆ పెద్దాయన మరో పార్టీ టికెట్ కోసం అన్వేషించారు. తన వాళ్ళ పార్టీ అయిన ప్రజారాజ్యం తరఫున ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆదికేశవులు నాయుడు తలచుకుంటే కనీసం వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ వస్తుందన్న ఆశతో ప్రజారాజ్యం అగ్ర నాయకులు ఆయన ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి సాధ్యం కాదు. తమిళనాడు లేదా కర్నాటక లోని ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా గెలిచి వస్తానని ఆదికేశవులు నాయుడు రాయబారాలు పంపుతున్నట్టు సమాచారం.
More From
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications