వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా దేనికి భయపడుతోంది?

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా మీద ప్రజారాజ్యం నేతలు తీవ్ర స్ధాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. రోజా గత చరిత్ర చాలా హీనమైనదంటూ ప్రజారాజ్యం మహిళా నేతలు కూడా విరుచుకు పడ్డారు. ఇప్పుడు నాగబాబు, పవన్ కల్యాణ్ రోజాను రకరకాల పదజాలంతో విమర్శిస్తున్నారు. "రోజా పూజకు పనికి రాని పువ్వు" అని నాగబాబు చేసిన వ్యాఖ్యను మహిళా సంఘాలు అభ్యంతరకరంగా పరిగణిస్తున్నారు. రోజా ఈ విషయంలో సంయమనంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతనే ఆమె నోరు విప్పుతారని తెలుస్తోంది.

రోజాకు చంద్రగిరి నుంచి తెలుగుదేశం టికెట్ ఖరారు కావడంతో ఆమె అక్కడి స్ధానిక నాయకులతో మంతనాలు జరపడంలో బిజీగా ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద రోజా తీవ్ర ఆరోపణలు చేయకపోవడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వైఎస్ మీద ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవానీ ఆమె మీద మాటలతోనే కాకుండా భౌతికంగా చెప్పులతో కూడా దాడి చేస్తుందన్న భయం ఉండడం ఒక కారణం కావచ్చు. గతంలో గంగాభవాని నన్నపనేని రాజకుమారి ఇంటికి వెళ్ళి ఆమె మీద దాడి చేసిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X