వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోజా దేనికి భయపడుతోంది?
రోజాకు చంద్రగిరి నుంచి తెలుగుదేశం టికెట్ ఖరారు కావడంతో ఆమె అక్కడి స్ధానిక నాయకులతో మంతనాలు జరపడంలో బిజీగా ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద రోజా తీవ్ర ఆరోపణలు చేయకపోవడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వైఎస్ మీద ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవానీ ఆమె మీద మాటలతోనే కాకుండా భౌతికంగా చెప్పులతో కూడా దాడి చేస్తుందన్న భయం ఉండడం ఒక కారణం కావచ్చు. గతంలో గంగాభవాని నన్నపనేని రాజకుమారి ఇంటికి వెళ్ళి ఆమె మీద దాడి చేసిన విషయం తెలిసిందే.
Comments
Story first published: Tuesday, February 10, 2009, 14:00 [IST]