నిత్యానంద స్వామిచే రంజిత కిడ్నాప్?
ఈ నేపథ్యంలో మంగళవారం ఓ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇవ్వ డం, అందులో కేరళ రాష్ట్రం తిరు అనే అక్షరంతో మొదలయ్యే ప్రదేశంలో ఆమె ఉన్నట్లు పేర్కొనడంతో ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. నిత్యానంద ప్రవచనాలు రాసిన మ్యాగజైన్కు మాత్రమే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం అనుమానాలకు దారితీస్తోంది. రంజిత వల్ల మరింత ముప్పు ఎక్కడ వస్తుందోనని భయపడిన నిత్యానందం మనుషులు ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని భావి స్తున్నారు. ఈ మేరకు కేరళ పోలీసుల సహకారంతో రంజిత ఆచూకీని కనిపెట్టేందుకు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే రక్షణ కోరుతూ వచ్చి ఫిర్యాదు చేసి వెళ్లిన లెనిన్ కరుప్పన్ కోసమూ గాలిస్తున్నారు.
కొనసాగుతున్న భక్తుల ఆగ్రహావేశాలు: నిత్యానందం, రంజిత రాసలీలల వ్యవహారంపై భక్తులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మంగళవారం నిత్యానందకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. నిత్యానందను అరెస్ట్ చేయాలని పురట్చి భారతం నేతృత్వంలో పెరంబూర్లో ఆందోళన జరిగింది. నిత్యానందం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామేశ్వరంలో హిందూ మక్కల్ కట్చి వినూత్న తరహాలో నిరసన తెలియజేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన నిత్యానంద మరణిం చాడంటూ తర్పణం వదిలారు.