చిరు మోహన్ బాబుతో డిన్నర్ చేస్తే తప్పా?
మొన్న తన సొంత నియోజకవర్గమైన తిరుపతి వెళ్ళిన చిరంజీవి అర్ధరాత్రి మోహన్ బాబు ఇచ్చిన పార్టీకి హాజరవడం, రెండు గంటలు గడపడం చిరు అభిమానులకు బాధ కలిగించిందట. అయితే ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి అందరివాడుగా ఉండాల్సిందే. అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మాజీ రాజ్యసభ సభ్యుడైన మోహన్ బాబును ఆయన ఒక పార్టీ నాయకుడిగా కలుసుకోవడంలో తప్పేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో కమ్మ నాయుళ్ళకు, బలిజ నాయుళ్ళకు మధ్య చాలా కాలంగా వైరముంది. చిరంజీవిని బలిజ నాయుళ్ళు బలపరుస్తున్నారు.
Story first published: Monday, July 26, 2010, 10:33 [IST]