తెలంగాణ మంత్రులకు కిరణ్ పాఠాలు

kiran kumar reddy
సకల జనుల సమ్మె విరమణతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాస్తా ఊరట లభించింది. దీంతో ఆయన తెలంగాణ మంత్రులతో మంగళవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వారికి ఆయన సంక్షేమ పాఠాలు చెప్పారు. సంక్షేమ మాసం ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని వారికి ఆయన హితబోధ చేశారు. సకల జనుల సమ్మె కాలంలో ఆగిపోయిన ప్రయోజనాలను కూడా ప్రజలకు అందించాలని ఆయన సూచించారు.

రచ్చబండ రెండో విడత కార్యక్రమాన్ని నవంబర్ 2 నుంచి 15వ తేదీ వరకు పది పనిదినాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆయన తెలంగాణ మంత్రులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తప్ప తమకేమీ వద్దని తెలంగాణ ప్రజలు మొండికేస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రులకు ఎదురయ్యే ఇబ్బందులేమిటో తెలుసు. వాటిని తీర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా, అంటే లేరనే చెప్పాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+