జగన్ ఓదార్పునకు 'కోట్ల' చిక్కు

కాగా, అదే సమయంలో జగన్కు అదే గ్రామంలో మరో ఎదురు దెబ్బ కూడా తగిలింది. తమకు ఎవరి ఓదార్పు లేదని ఆ గ్రామానికి చెందిన కోయిలకుంట్ల సావిత్రమ్మ అంటోంది. తన భర్త అనారోగ్యంతో మరణించాడని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రెండు రోజులకు గోపాల్ అనే రైతు మరణించాడు. ఈ మరణాన్ని వైయస్ జగన్ వర్గీయులు వైయస్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి జాబితాలో చేర్చారు. అయితే, తన భర్త కేవలం అనారోగ్యం కారణంగానే మరణించాడని సావిత్రమ్మ చెబుతోంది.












Click it and Unblock the Notifications