సిబిఐ ప్రకటన: గాంధీజీ మూడు కోతులు

మీడియా వల్ల నిజాయితీపరులైన సాక్షులు తమ వద్దకు రావడానికి జంకుతున్నారని కూడా చెప్పింది. దానివల్ల విచారణకు విఘాతం ఏర్పడుతుందని చెప్పింది. హైదరాబాద్ సిబిఐ ఎస్పీ హెచ్ వెంకటేష్ పేర ఆ ప్రకటన జారీ అయింది. ఆ ప్రకటనను సిబిఐ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా పంపించింది. అయితే, ఆ ప్రకటన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ పేరు మీద కూడా ఎస్పీ స్థాయి అధికారి వెంకటేష్ ఎందుకు జారీ చేశారని ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఐఎఎస్ అధికారుల గగ్గోలుతో సిబిఐ ఎస్పీ వెంకటేష్ ఆ ప్రకటన విడుదల చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications